తిరుపతి లడ్డూ వ్యవహారంపై.. ప్రకాష్ రాజ్ మరో సంచలన పోస్ట్.. ఆ ఇద్దరికేనా..?

Divya
ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశవ్యాప్తంగా తిరుపతి దేవస్థానం లడ్డు అంశం పైన ఇప్పుడు ఒక చర్చనియంశం జరుగుతోంది. ముఖ్యంగా లడ్డు కల్తీ జరిగిందని ఇందులో జంతువుల కొవ్వు కలిపారనే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపణలు చేశారు. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేయడంతో ఈ విషయం మరింత వైరల్ గా మారింది. ఈ విషయం పైన చాలామంది అటు కూటమి నేతలను విమర్శిస్తూ ఉండగా మరికొంతమంది వైసీపీ పార్టీని విమర్శిస్తూ ఉన్నారు.

గత కొద్దిరోజులుగా పవన్ కళ్యాణ్ వ్యవహారం పైన నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. తన ట్విట్టర్ నుంచి కొన్ని రకాల క్యూస్షన్స్ ను కూడా అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా దేవుళ్లను రాజకీయాలలోకి లాగొద్దండి అంటూ న్యాయస్థానం సూచించింది దీంతో ఇప్పటికైనా ఈ విషయాన్ని రాజకీయాలలోకి లాగడం మానుకోవాలి అంటూ తన ట్విట్టర్ నుంచి ప్రకాష్ రాజ్ ఒక పోస్ట్ ని షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో పాటు సుప్రీంకోర్టు ఫోటోను కూడా షేర్ చేయడం జరిగింది.

గతంలో లడ్డు వివాదం పైన ప్రకాష్ రాజ్ ట్వీట్ పవన్ కళ్యాణ్ కౌంటర్ వేయడం కూడా జరిగింది. దీంతో గత కొద్ది రోజులుగా ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఒక ట్విట్ వారే జరుగుతోంది. అంతేకాకుండా తమిళ హీరో కార్తీ పైన చేసిన వ్యాఖ్యలకు కూడా ప్రకాష్ రాజ్ మద్దతుగా నిలిచారు. చేయని తప్పుకి మీరు ఎందుకు స్వారీ చెప్పాలి అంటూ జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ట్విట్ చేశారు. ఇలా తిరుపతి లడ్డు వ్యవహారం పైన ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి ట్వీట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. దీంతో ఈయన అభిమానులు కచ్చితంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈయనకి అవకాశాలు రాకుండా చేస్తారు అనే విధంగా కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: