బాబోయ్.. సర్పించి పదవి కోసం రూ. రెండు కోట్లా? మన దగ్గర కూడా ఇలాంటి ఆఫర్ ఉంటే బాగుండు..!

Chakravarthi Kalyan

కొన్ని సంఘటనలు పరిగణనలోకి తీసుకున్నప్పుడు భారత దేశంలో రాజకీయాలకంటే మెరుగైన, మేలైన, లాభదాయకమైన వ్యాపారం మరోకటి లేదని ఒకరంటే.. పెట్టుబడి కూడా అదే స్థాయిలో ఉంటుందని మరికొందరు చెబుతుంటారు. ఈ క్రమంలో ఆ కామెంట్లకు బలం చేకూరుస్తూ.. సర్పించి పదవి కోసం రూ.2 కోట్లు అనే విషయం తెరపైకి వచ్చింది.


అవును.. పంజాబ్ లోని గురుదాస్ పుర్ జిల్లాలోని హర్దోవల్ కలాన్ సరిహద్దు గ్రామం సర్పించి పదవి కోసం వేలం వేసింది. ఈ వేలంలో ఆ సర్పంచి పదవి రూ.2 కోట్ల మార్కును తాకడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ వ్యవహారంలో స్థానిక బీజేపీ నాయకుడు ఆత్మసింత్ అత్యధిక బిడ్ వేయడం ద్వారా మిగిలిన ఇద్దరు ప్రత్యర్థులిద్దరనీ ఓడించాడు.


ఈ గ్రామంలో సర్పించి పదవి కోసం ప్రధానంగా ముగ్గురు మధ్య భారీ పోటీ నెలకొంది. ఇందులో భాగంగా బీజేపీ నుంచి ఆత్మసింగ్, జస్విందర్ సింగ్ బేదీ, నిర్వైర్ సింగ్ లు పోటీ పడ్డారు. ఆ సమయంలోనే ఆత్మసింగ్ రూ.2కోట్ల బిడ్ వేసి సర్పంచి పదవిని దక్కించుకున్నారు. ఈ నిధులు గ్రామ అభివృద్ధికి వెచ్చించనున్నట్లు గ్రామ కమిటీ తెలిపింది.


ప్రభుత్వ, పంచాయతీ గ్రాంటులతో సంబంధం లేకుండా నిధులను ఉపయోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసింది ఆ గ్రామ యువజన సమ్మేళనం. ఇలా వేలం వేసి సర్పించి ను ఎన్నుకునే విషయంలో ఈ గ్రామం పేరు గడించిందని చెబుతున్నారు. వాస్తవానికి ఈ వేలం రూ.50 లక్షలతో ప్రారంభం అయింది. అనంతరం వేగం పెరగడం మొదలైంది. ఈ సమయంలో ఆత్మసింగ్ అత్యధిక ధర వెచ్చించి పదవిని దక్కించుకున్నాడు. తన తండ్రి గతంలో సర్పంచి గా పనిచేశారని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తాను కూడా సర్పంచి అవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ గ్రామంలో 350 ఎకరాల భూమి ఉందని.. తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామంలోని యువకలుతో కలిసి మరింత అభివృద్దికి కృషి చేస్తానని ఆత్మసింగ్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: