దువ్వాడ ఎవ్వారం ఎక్కడికో పోయింది... ప్రియురాలితో స్కూటీపై రొమాన్స్...?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో వైసీపీ నేతల రాసలీలలు బయటపడుతున్న సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు నుంచి మొదలుకొని... దువ్వాడ శ్రీనివాస్ వరకు...  చాలామంది రకరకాల కాంట్రవర్సీల కారణంగా హాట్ టాపిక్ అయ్యారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో దువ్వాడ శ్రీనివాస ప్రేమ కథ చిత్రం.. హల్ చల్ చేసిందని చెప్పవచ్చు. తన కూతురు వయసు ఉన్న.. మాధురితో... ఎఫైర్ పెట్టుకున్నాడు దువ్వాడ శ్రీనివాస్. ఆ పవిత్ర బంధానికి ప్రేమ అని కూడా జోడించారు.

దాదాపు 58 సంవత్సరాలు ఉన్న దువ్వాడ శ్రీనివాసును 33 సంవత్సరాలు ఉన్న మాధురి ప్రేమిస్తోంది. వీరిద్దరి ప్రేమ కారణంగా దువ్వాడ శ్రీనివాస్ కుటుంబం రోడ్డున పడింది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి... తన కూతుర్లతో కలిసి దీనిపై న్యాయపోరాటం కూడా చేయడం మనం చూసాం. దువ్వాడ శ్రీనివాస్ కట్టుకున్న ఇంటికి వచ్చి మరి ఆయన భార్య పిల్లలు ధర్నా కూడా చేశారు. అప్పట్లో ఈ అంశం హాట్ టాపిక్ అయింది.

అయితే.. ఈ విషయం నేపథ్యంలో మాధురి.. ఆత్మహత్య కూడా చేసుకున్నా సంఘటన మనం చూసాం. కార్లో వెళ్తూ.. ఒక్కసారిగా హ్యాండ్ బ్రేక్ వేయడంతో కారు బోల్తా కొట్టింది. దీంతో మాధురికి తీవ్ర గాయాలు కాగా.. ప్రాణాలతో అయితే బయటపడింది. అయితే ఈ యాక్సిడెంట్ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ మళ్లీ తెరపైకి రాలేదు. కానీ... లేటెస్ట్ గా దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ప్రేమ కథ తెరపైకి వచ్చి హాట్ అయింది.

దువ్వాడ శ్రీనివాస్ అలాగే మాధురి ఓ ప్రమోషన్ వీడియో..చేస్తూ అందరిని... ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రమోషన్ లో భాగంగా దువ్వాడ శ్రీనివాస్, మాధురి ఒకే బైక్ పైన కూర్చొని...రొమాన్స్ చేస్తూ కనిపించారు. ఇందులో దువ్వాడ శ్రీను బైకు నడపగా.. వెనకాల కూర్చున్న మాధురి ఆయనను గట్టిగా.. పట్టుకొని కూర్చుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేసింది మాధురి. దువ్వాడ శ్రీను కొత్తగా కట్టుకున్న ఇంట్లోనే ఈ... రచ్చ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: