రతన్ టాటా కోసం కన్నీరు పెట్టుకున్న శునకం ?

Veldandi Saikiran

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఇవాళ మరణించిన సంగతి తెలిసిందే.  బుధవారం ఉదయం పూట ఆయన ఆరోగ్యం క్షమించడంతో... మరణించారు రతన్ టాటా. అయితే... పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా... మరణించిన నేపథ్యంలో.... ఓ అరుదైన సంఘటన చోటుచేసుకుంది.  పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా.... కోసం తన పెంపుడు కుక్క.... దీనంగా ఎదురుచూస్తున్న సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. రతన్ టాటా పెంచుకున్న కుక్క పేరు గోవాగా... నామకరణం చేశారు.

అయితే ఇప్పుడు తన బాస్ రతన్ టాటా లేక పోవడంతో... గోవా చాలా... ఎమోషనల్ గా ఎదురు చూస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో... హాట్ టాపిక్ అయింది. ఇక ఆ కుక్కను...  రతన్ టాటా మృతదేహం వద్దకు... స్వయంగా పోలీసుల తీసుకువెళ్లారు. బ్లాక్ కలర్ లో ఉన్న ఈ కుక్క  అంటే రథన్ టాటా కు చాలా ఇష్టమట. వాస్తవంగా... ఈ బ్లాక్ డాగ్... గోవా వెళ్ళినప్పుడు రతన్ టాటా కు దొరికిందని సమాచారం. దీంతో దానికి గోవా అని పేరు పెట్టారట రతన్ టాటా.
రతన్ టాటా కు సంబంధించిన బాంబే హౌస్ లో...ఎన్నో రకాల కుక్కలు ఉన్నా కూడా.... ఆయన ఈ గోవా కోసం...వెతికే వారట. అంతేకాదు అన్ని కుక్కలను వదిలేసి ఒక ఈ ఒక్క కుక్కతోనే... సమయాన్ని గడిపే వారట. ఆ గోవా కుక్కతో ఎంజాయ్ చేసేవారట. అయితే అలాంటి రతన్ టాటా ఇప్పుడు మరణించడంతో... గోవా కుక్క ఒంటరి అయిపోయింది.

ఇది ఇలా ఉండగా ప్రముఖ దిగ్గజ వ్యాపార వేత్త రథన్ టాటా.... అంతక్రియలను  మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంచనాలతో నిర్వహిస్తోంది.  భారత  రత్న కోల్పోయామని... మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో అధికారిక లాంచనాలతో  ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త రథన్ టాటా.... అంతక్రియలను దగ్గరుండి నిర్వహిస్తోంది సర్కార్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: