ఎందక్కా నువ్వు ఏ సందులోంచి చూసావ్.. శ్యామలపై రెచ్చిపోయిన కిర్రాక్ ఆర్పీ..!!

murali krishna
ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి వైసీపీ నేతలలో గుబులు మొదలైంది.. ఏ క్షణం ఏమి జరుగుతుందో అని టెన్షన్ తో గడుపుతున్నారు.. దీనికి కారణం గతంలో టీడీపీ నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడమే.. వైసీపీ కార్య కర్తలకు జగన్ ధైర్యం చెప్పుకొస్తున్నారు.. ఎలాంటి సమస్యను అయిన దైర్యంగా పోరాడండి.. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొండి పార్టీ బలోపేతంలో అందరూ భాగస్వామ్యం అవ్వండని జగన్ పార్టీ నేతలకు పిలుపు నిచ్చారు.. అంతే కాదు పార్టీలోని కొందరు నేతలకు జగన్ కీలక పదవులు అప్పజెప్పారు.. జగన్ ఇచ్చిన దైర్యం తో వైసీపీ నేతలు కూటమిపై జోరుగా విమర్శలు చేస్తున్నారు.. ప్రస్తుతం అధికార కూటమి, వైసీపీ నేతల మధ్య విమర్శల తాకిడి ఎక్కువైంది.
తాజాగా కూటమి పక్షాన వున్న కిర్రాక్ ఆర్పీ, వైసీపీ అధికార ప్రతినిధి అయిన శ్యామల మధ్య విమర్శల జోరు కొనసాగుతుంది.. ఇద్దరూ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారే అయినా కూడా పార్టీలు వేరు కావడంతో విమర్శల తీవ్రత మరింత ఎక్కువైంది. వైసీపీ అధికార ప్రతినిధిగా వున్న శ్యామల మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు రక్షణ ఎక్కడుంది.ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలే అయినా రాష్ట్రంలో ఘోరాలు మాత్రం జోరుగా జరుగుతున్నాయని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కరువయ్యాయి కూటమి వంద రోజుల పాలనలో ఏ హామీని నెరవేర్చకుండా అనవసరం అయిన విషయాలతో ప్రభుత్వం ప్రజలను మభ్య పెడుతుందని శ్యామల విమర్శించారు.. కూటమి దొంగ హామీలు విని ఓటు వేసిన ప్రజలు తాము మోసపోయినట్లు గ్రహించారు.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కనుక హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడతారని శ్యామల విమర్శించింది.శ్యామల మాటలకు కౌంటర్ గా  కిర్రాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ఎక్కడో బంజారాహిల్స్ లో వుంటూ నన్ను మించిన రాష్ట్ర అధికార ప్రతినిధి లేరంటూ అబద్ధపు ఆరోపణలు చేయడం మంచిది కాదు..రాష్ట్రంలో
మహిళలకు భద్రత లేదని నువ్వు ఎలా నిర్దారిస్తావ్ అక్కా నువ్వు ఏ సందులోంచి చూసావ్ ఆడవారికి రక్షణ లేదని ఎలా చెబుతావ్..జరగని అఘాయిత్యాలను జరిగినట్లుగా చెప్పడం ఎంతవరకు సమంజసం..అని ఆర్పీ శ్యామలపై ప్రశ్నల వర్షం కురిపించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: