వైరల్: భాగ్యనగరంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై గ్యాంగ్ రేప్.!

FARMANULLA SHAIK
రాష్ట్రంలో అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. చిన్న, పెద్ద అని తేడా లేకుండా యువకులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి దారుణ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఆర్‌సీ పురం దగ్గర ఓ యువతి సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అర్థరాత్రి ఆర్‌సీపురం దగ్గర ఆటో ఎక్కి 2:30 సమయంలో మసీద్ బండ ప్రాంతానికి చేరుకుంది. ఆ ప్రాంతానికి యువతి చేరిన తర్వాత ఆటో ఆపిన డ్రైవర్, మరో యువకుడు కలిసి ఆమెపై అత్యాచారం చేశారు. ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో దుండుగులు ఈ దారుణానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసి ఆమెను అక్కడే వదిలేసి ఆ ఇద్దరు యువకులు పారిపోయారు. బాధితురాలు వెంటనే గచ్చిబౌలి స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలి కాలంలో హైదరాబాద్‌లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, హత్యలు, అత్యాచారాలు మరింత పెరుగుతున్నాయన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ ఘటన కూడా నగరంలో భద్రతపై సీరియస్ ప్రశ్నలు లేవనెత్తుతోంది. మహిళల భద్రతకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని, నిందితులకు కఠిన శిక్షలు విధించాలని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.ఇదిలా ఉండగా ఏపీలో కూడా కొందరు యువకులు అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. పొట్టకూటి కోసం వలస వచ్చిన ఓ కుటుంబంపై గంజాయి మత్తులో ఉన్న మృగాలు దాడి చేశారు. నిర్మాణంలో ఉన్న పేపర్‌ మిల్లులో పనిచేస్తున్న వాచ్‌మన్‌ కుటుంబంలోని అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తెలిసిందే. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో శుక్రవారం జరిగిన ఈ దారుణ ఘటన ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పేపన్ మిల్లు పక్కనే ఆ వాచ్‌మ్యాన్ భార్య, కుమారుడు, కోడలు నివసిస్తున్నారు. అక్కడికి ద్విచక్రవాహనాలపై వెళ్లిన ఆరుగురు దుండగులు వాచ్‌మన్‌ను తాగడానికి నీరు అడిగారు. ఇంతలో భార్య, కుమారుడు, కోడలు బయటికి రాగా.. వారిని కొట్టి అత్తాకోడళ్లపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: