ఏపీ: మరో రెండు పథకాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..!

Divya
సూపర్ సిక్స్ హామీల వల్లే 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం భారీ విజయాన్ని అందుకుంది.. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి నాలుగు నెలలు కావస్తువున్న పలు కీలకమైన పథకాలను అమలు చేయకపోవడంతో అటు కూటమి ప్రభుత్వం పైన టిడిపి నేతలపైన దారుణమైన విమర్శలు కూడా చేస్తున్నారు ప్రజలు.. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజే పింఛన్ పెంపు వ్యవహారం పైన మొదటి సంతకాన్ని చేశారు.

ఆ తర్వాత ఉచిత ఇసుక విధానాన్ని కూడా అమలు చేశారు.. దీపావళికి అటు ఉచిత గ్యాస్ సిలిండర్లతో పాటు, ఉచిత ఫ్రీ బస్ ని కూడా అమలు చేసే విధంగా  ప్లాన్ చేస్తున్నారు.. అయితే ఎప్పటినుంచో స్కూలుకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకం పైన , రైతులు ఎంతకాలమో ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం పైన కూడా తాజాగా ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసినట్లు తెలుస్తోంది. స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు కూడా తల్లికి వందనం పథకం వర్తిస్తుందని తెలుపుతున్నారు. అలాగే ఇంట్లో ఎంతమంది చదువుతూ ఉంటే వారందరికీ కూడా 15000 చొప్పున ఇస్తామంటూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో తెలియజేశారు.. ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచే పథకాన్ని అమలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట.

అయితే ఇందుకు ప్రతి ఏడాది కూడా 12 వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని వెల్లడిస్తున్నారు.. అలాగే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది 20వేల రూపాయలు అందిస్తామని చెప్పిన వాటి మీద కూడా వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ లో అమలు చేస్తామంటూ తెలియజేశారు.. దీంతో అటు ఏపీ ప్రజలకు మరో రెండు పథకాలకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం.. మరి ఏ మేరకు ఎవరెవరికి ఎలాంటి షరతులు పెడతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: