ఏపీ: బాలికపై అత్యాచారం.. పురుగుల మందు తాగించి మరీ..?

Divya
ఆంధ్రప్రదేశ్లో తరచూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా మహిళల పైన అత్యాచార సంఘటనలు ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది మహిళలు ఈ అత్యాచార బాధితుల వల్ల మరణిస్తూ ఉన్నారు. తాజాగా  కర్నూలు జిల్లాలో మరొక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైన ఘటనతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ అత్యాచార ఘటన గురించి పూర్తిగా చూద్దాం.

కర్నూలు జిల్లాలోని అన్పారి మండలంలో ఈ సంఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.. అశ్విని అనే అమ్మాయి ఇంటర్ చదువుతూ ఉండేదట. అయితే ఆమెను గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానంటూ అదే ప్రాంతానికి చెందిన చిన్న వీరేష్ ఆ బాలికను విసిగిస్తూ ఉండేవారట. దసరా సెలవులకు ఊరికి వచ్చిన అశ్విని గమనించిన వీరేష్ ఆమెను ప్రతిరోజు ప్రేమించకపోతే చంపేస్తానంటూ బెదిరించే వారట. అలా ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి ఆ బాలికపైన అత్యాచారం చేసి చంపేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె నోట్లో పురుగుల మందు పోసి మరి అత్యాచారం చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఆ బాలిక వీరేష్ నుంచి బయటికి రావడానికి ఎంతో ప్రతిఘటించిన కూడా విడిపించుకోలేకపోయిందట. చివరికి పెనుగులాటలో వీరేష్ కి కూడా గాయాలైనట్లు సమాచారం. ఇక అస్వని తల్లిదండ్రులు పొలం పనులు చూసుకుని ఇంటికి వచ్చిన తరుణంలో తమ కుమార్తెనీ చూసి ఒక్కసారిగా షాప్ కి గురయ్యారు. అయితే వెంటనే  దగ్గర్లో ఉండే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి అశ్వనిని తరలించగా.. అప్పటికే అశ్విని మృతి చెందినట్లుగా వైద్యులు తెలియజేశారట. దీంతో ఆ తల్లిదండ్రుల తన కూతురు మరణం విని కన్నీరు మున్నీరవుతున్నారు.. ప్రేమ పేరుతోనే తన కూతురిని వేధించారంటూ ఆ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారట.. అలాగే తమ కూతురు పైన అత్యాచారం చేసిన ఆ ఉన్మానికి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: