వయనాడ్ కోసం తెలంగాణ హెలికాప్టర్లు..?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత... వివాదాస్పద నిర్ణయాలు తీసుకుని... కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వచ్చేలా చేస్తున్నారు. అయితే తాజాగా... తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పై మరో విమర్శ తెరపైకి వచ్చింది. వయనాడు ఎన్నికల ప్రచారంలో...తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్ వాడారట.
దీనికి సంబంధించిన న్యూస్... గులాబీ పార్టీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బుధవారం రోజున వయనాడు  లోక్సభ ఎంపీగా... పోటీ చేసేందుకు గాను ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో... దేశంలోని కాంగ్రెస్ నేతలు అందరూ పాల్గొన్నారు. అయితే వయనాడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ హెలికాప్టర్లు వాడినట్లు గులాబీ పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది.
 మొన్న ఖమ్మం వరదల్లో వాడని హెలికాప్టర్లు ఏపీకి పంపించారని... రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై మరక వచ్చి పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వయనాడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ హెలికాప్టర్ వాడారని... గులాబీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. బుధవారం రోజున ప్రియాంక గాంధీ నామినేషన్ కు... తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హెలికాప్టర్ వాడినట్లు వార్తలు వస్తున్నాయి.
 ఇదే హెలికాప్టర్లో రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే కేసి వేణుగోపాల్ కూడా... ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సొమ్మొకడిది సోకొకడిది అన్నట్లుగా... కాంగ్రెస్ జాతీయ నేతలు తెలంగాణ సొమ్మును వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ ప్రజలు. దీనిపై వెంటనే రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గులాబీ పార్టీ చేస్తున్న ఈ ప్రచారం పైన... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. దీనికి కౌంటర్ ఇస్తారా లేక... అదే నిజమని సైలెంట్ గా ఉంటారా... అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: