విజయమ్మను టార్గెట్ చేస్తున్న వైఎస్సార్ ఫ్యాన్స్.. జగన్ కు నష్టం చేయొద్దంటూ?

Reddy P Rajasekhar
వైఎస్ విజయమ్మ ఒకప్పుడు రాజకీయాల్లో యాక్టివ్ గానే ఉన్నా ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే. తల్లికి బిడ్డపై ప్రేమ ఉండటంలో తప్పేం లేదు కానీ విజయమ్మ వ్యవహరిస్తున్న తీరు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ను చట్టపరంగా భారీ దెబ్బ తీసే విధంగా అడుగులు పడుతున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
వైఎస్సార్ బ్రతికున్న సమయంలోనే ఆస్తుల పంపకాలు పూర్తయ్యాయట. సరస్వతీ పవర్ కంపెనీ విషయానికి వస్తే ఈ కంపెనీలో జగన్ కు 99 శాతం షేర్లు ఉండగా ఒక శాతం షేర్లు మాత్రం విజయమ్మకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీ సీబీఐ, ఈడీ అటాచ్మెంట్ లో ఉంది. కేసులు పూర్తైన తర్వాత చెల్లికి ఈ ఆస్తులను బదిలీ చేయవచ్చని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కేసు తేలకుండా షేర్ల బదిలీ వల్ల జగన్ బెయిల్ రద్దయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.
 
ఈ రీజన్ వల్ల వైఎస్సార్ అభిమానులు విజయమ్మను టార్గెట్ చేస్తుండటం గమనార్హం. కూతురిని గుడ్డిగా నమ్మి విజయమ్మ తప్పు చేస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయమ్మ నెగిటివ్ కామెంట్ల విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. విజయమ్మ  అనవసర వివాదాల్లో చిక్కుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
జగన్ కు నష్టం చేసేలా విజయమ్మ వ్యవహరించవద్దని మరి కొందరు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. షర్మిల పొలిటికల్ నిర్ణయాల విషయంలో సైతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. షర్మిల రాజకీయాల ద్వారా ఏం సాధిస్తున్నారని జగన్ ను ఇబ్బంది పెట్టడం తప్ప ఆమె ఏం సాధించారని కామెంట్లు వినిపిస్తున్నాయి. వైఎస్ విజయమ్మకు ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం కూడా ఇదే తొలిసారని చెప్పవచ్చు. చిన్నచిన్న తప్పులే ఆమెకు పెద్ద సమస్యలను సృష్టిస్తున్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. విజయమ్మ పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: