ఏపీ: షేక్ చేసేలా వైసిపి సంచలన ట్విట్.. చిక్కుల్లో కూటమి..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు రోజురోజుకీ సంచలనంగానే మారుతూ ఉన్నాయి.. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్విట్టర్ వార్ అయితే గత కొద్దిరోజులుగా జరుగుతూనే ఉంది. టిడిపి ట్విట్టర్ నుంచి జగన్ కుటుంబానికి సంబంధించి పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా చేయడంతో షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా టిడిపికి అనుకూలంగా వ్యవహరిస్తోందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదంతా కూడా ఆస్తి గొడవలకే కారణం అన్నట్లుగా సమాచారం.అయితే నిన్నటి రోజు నుంచి అటు టిడిపి వైసిపి ఈరోజు బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నాం అనే విధంగా  తెలియజేశారు.

అయితే టిడిపి నిన్నటి రోజున ట్విట్టర్ వేదికగా జగన్ కుటుంబంలో జరుగుతున్న విషయాలను షేర్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు తాజాగా వైసిపి ట్విట్టర్ నుంచి టిడిపి పై మరొక సంచలన ట్వీట్ చేసింది.. అదేమిటంటే మీడియా ముసుగు వేసుకొని డ్రగ్స్ మాఫియా నడుపుతున్నటువంటి టిడిపి చైర్మన్ వాళ్లకే పదవులు అందజేత అంటూ.. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో పలు రకాల వ్యవహారాలు చేస్తూ ఉన్నారంటూ అది కూడా ఎల్లో మీడియా ఛానల్ అధినేత ఇదిగో సాక్ష్యాలు అంటూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది.దీంతో పలువురు కార్యకర్తలు, ప్రజలు  ఇది కనుక నిజమైతే కచ్చితంగా కూటమి ప్రభుత్వం చిక్కుల్లో ఉంటుందనే విధంగా తెలియజేస్తున్నారు.

ఒక్క సారిగా ఈ పోస్ట్ చూసిన వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వైసిపి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ట్రూత్ బాంబ్ అంటూ ఉత్కంఠ రేపిన జరిగింది. గత కొన్నేళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో ఇలాంటి వ్యవహారాలు నడుపుతున్న ఎల్లో మీడియా ఛానల్ అధినేత అంటూ పలు రకాల విషయాలను జత చేసి మరి షేర్ చేశారు. మొత్తానికైతే సోషల్ మీడియాలో అటు వైసిపి టిడిపి మధ్య రాజకీయంతో పాటుగా సోషల్ మీడియా కూడా హీటెక్కించేలా చేశారు. మరి ఇలాంటి విషయాల పైన అటు టిడిపి ఎలాంటి కౌంటర్ వేస్తుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: