దీపావళి కంటే ముందే పొలిటికల్ బాంబులు..నవంబర్ 1 నుంచే ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీపావళి కంటే ముందే పొలిటికల్ బాంబులు తెలంగాణలో పేలబోతున్నాయని ఆయన వెల్లడించడం జరిగింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. అతి త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ బాంబులు పేలబోతున్నట్లు తాజాగా ప్రకటించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
దీంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చుట్టూ తిరుగుతున్నాయి. గులాబీ పార్టీ ప్రభుత్వంలో... చాలావరకు అవినీతి జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. అయితే కెసిఆర్ ప్రభుత్వంలో కొంతమంది ప్రముఖులు..  చేసిన అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వారికి సంబంధించిన ఫైల్స్ సిద్ధం అయ్యాయని బాంబు పేల్చారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
 నవంబర్ ఒకటో తేదీ నుంచి నవంబర్ 8వ తేదీ వరకు... ఆ ప్రముఖులందరూ జైలుకు వెళ్తారని ఆయన చెప్పకనే చెప్పారు.  వారికి సంబంధించిన ఆధారాలు పక్కాగా ఉన్నాయని ఆయన బాంబు పేల్చారు. ఈ విషయంలో ఎవరిని వదిలిపెట్టబోమని కూడా హెచ్చరించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. మరో రెండు మూడు రోజుల్లోనే... తెలంగాణలో పొలిటికల్ బాంబులు పేలుతాయని ఆయన పేర్కొనడం జరిగింది.
 అయితే తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు... కెసిఆర్ కుటుంబాన్ని ఉద్దేశించి చేసినవని కొంతమంది అంటున్నారు. అయితే మరికొంతమంది కాంగ్రెస్ నేతల గురించే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారని... ట్ర్రోలింగ్ కూడా చేస్తున్నారు. ఇది.. ఇలా ఉండగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి... ఇంట్లో ఈడి దాడులు జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఈడి అధికారులు...ఇవ్వకుండానే ఈ కేసును మూసివేసారని కూడా ప్రచారం జరుగుతోంది. ఆయన బిజెపితో కుమ్మక్కయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: