మరోసారి పొలిటికల్ బాంబు పేల్చిన వేణు స్వామి.. ఈసారి ఏకంగా..?

Divya
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ జ్యోతిష్యుడుగా పేరు పొందిన వేణు స్వామి గురించి చెప్పాల్సిన పనిలేదు. నిరంతరం ఏదో ఒక వార్తలలో నిలుస్తూనే ఉంటారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలను సైతం తెలియజేస్తూ ఉంటారు. గతంలో వేణు స్వామి చెప్పినట్లుగా ఎక్కువగా జరగడంతో ఈయనని ఎక్కువగా ఫాలో అయ్యేవారు ఉన్నారు. అయితే 2024 ఎన్నికలలో భాగంగా చెప్పిన జోష్యం ఫలించకపోవడంతో అప్పటినుంచి ఈయనని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభాస్ సినిమాల విషయంలో కూడా ట్రోల్ కి గురయ్యారు.

కానీ గతంలో సమంత ,నాగచైతన్య విషయంలో మెగా డాక్టర్ నిహారిక విషయంలో ఆది పురుష్ సినిమా ఫ్లాప్ అవుతుందని విషయంలో కరెక్ట్ గానే చెప్పారు వేణు స్వామి. దీంతో చాలామంది సెలబ్రిటీలు కూడా ఈయనతో పూజ చేయించుకునే వారట. అలాగే చంద్రబాబు, కవిత వంటి పొలిటికల్ లీడర్స్ గురించి కూడా ఆయన చెప్పినట్టుగా జరిగింది. తెలంగాణలో కేసీఆర్ ఏపీలో జగన్ సీఎం గా గెలుస్తారని చెప్పిన అది జరగలేదు. దీంతో తాను ఇకమీదట ప్రిడిషన్ చెప్పనని కూడా తేల్చి చెప్పేశారు వేణు స్వామి. ఆ తర్వాత ఒక వార్తా చానల్ ప్రతినిధితో గొడవలు తీవ్ర ఇబ్బందులకు గురి అయ్యేలా చేశాయి.

అయితే ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి వారి విషయాలను తెలిపారట. ఈసారి తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల పైన స్పందించారట. తెలుగు సినిమా పరిశ్రమ తెలుగు రాజకీయాలు తనని కొద్ది నెలలుగా టార్గెట్ చేసుకున్నాయంటూ వేణు స్వామి తెలియజేశారు. అయితే ఈ రెండు ఇండస్ట్రీలో కూడా త్వరలోనే గింగిరాలు తిరగబోతున్నాయని ఏ లీడర్ చూసుకొనైతే విర్రవీగుతున్నారో వారందరికీ కూడా గుణపం దిగుతుంది అంటూ వేణు స్వామి తెలియజేసినట్లు సమాచారం. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: