ఏపీలో ఆ సర్టిఫికెట్ కావాలంటే రూ.10 వేలు చెల్లించాలట.. అసలేం జరిగిందంటే?

Reddy P Rajasekhar
ఈ మధ్య కాలంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా లంచం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని నియమ నిబంధనలు అమలు చేస్తున్నా కొంతమంది అధికారుల తీరు మాత్రం మారడం లేదు. ఏపీలో మ్యారేజ్ సర్టిఫికెట్ తెచ్చుకోవాలని భావించే వాళ్లకు చుక్కలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చాలామంది సరైన పెళ్లి సంబంధం దొరకక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి.
 
అయితే పెళ్లే కాదు రిజిస్ట్రేషన్ కూడా కష్టమేనంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఏపీలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్న సంగతి తెలిసిందే. పేద, మధ్య తరగతి వాళ్లకు పెళ్లిని రిజిష్టర్ చేయించుకోవడం తలకు మించిన భారంగా మారుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ప్రాంతాన్ని బట్టి 4,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది.
 
వివాహ రిజిస్ట్రేషన్ కావాలంటే పత్రిక, వధూవరుల ఆధార్ కార్డ్ లతో పాటు పదో తరగతి మార్క్ లిస్ట్, లాయర్ నుంచి అఫిడవిట్, కళ్యాణమండపం, దేవాలయాలలో పెళ్లి జరిగితే అందుకు సంబంధించిన రసీదు, తాళి కడుతున్న ఫోటోలు, పెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు సైతం ఉండాలి. పెళ్లి జరిగిన మూడు నెలల్లోగా ఈ సర్టిఫికెట్ ను తీసుకోవాల్సి ఉంటుంది.
 
ఒకవేళ ఏదైనా కారణం వల్ల ఆలస్యమైతే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ద్వారా మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా నియమ నిబంధనలు కఠినంగా మారడం వల్ల ఎన్నో జంటలు ఇబ్బందులు పడుతున్నాయి. ప్రభుత్వం అమలు చేసే పథకాల ప్రయోజనాలు పొందాలంటే రేషన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డ్ లేకపోతే మాత్రం చాలా పథకాల బెనిఫిట్స్ ను పొందలేమని చెప్పవచ్చు. ఏపీలో మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకునే వాళ్లు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా సర్టిఫికెట్ పొందడానికి ప్రయత్నిస్తే మంచిదని చెప్పవచ్చు. ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకుంటే మంచిదని కచ్చితంగా చెప్పవచ్చు.

 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: