ఏపీ: అన్నదాత సుఖీభవ పై..సర్కార్ గుడ్ న్యూస్..!

Divya
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా రైతులకే కాకుండా కౌలు రైతులు తీసుకొని మరి వ్యవసాయం చేసే రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని అందించే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద ఒక్కో రైతు కుటుంబానికి 20,000 చొప్పున అందించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ 20 వేల రూపాయలను సైతం మూడు విధానాలలో రైతులకు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6000 రూపాయలతో పాటుగా మొత్తాన్ని కలుపుకొని రైతుల ఖాతాలో జమ చేసేలా ఏపీ సర్కార్ భావిస్తోంది.


అయితే ఈ పథకం కింద అటవీ భూముల పైన హక్కు కలిగిన వారిని అర్హులుగా గుర్తించబోతున్నారు.. అలాగే వ్యవసాయ, ఉద్యాన, పట్టు  వారితో పాటుగా తహసిల్దార్, మర్దళ వ్యవసాయ అధికారులతో తమ పరిధిలో ఉండే రైతులకు సంబంధించి అన్ని వివరాలను కూడా పరిశీలించాలంటూ ఏపీ ప్రభుత్వం కోరింది.అలాగే ధ్రువీకరించిన అర్హుల జాబితాలను కూడా ఈ నెల 20వ తేదీ వరకు అన్నదాత సుఖీభవ వెబ్సైట్లో ఉంచేలా ప్రభుత్వం తెలియజేసింది. భర్త భార్య పిల్లలతో కూడిన కుటుంబం ఉండేలా ఉండాలట.


అలాగే పిల్లలకు వివాహమైతే వారికి ప్రత్యేకమైన యూనిట్ గా పరిగణించబోతున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ, ఉద్యాన, పట్టుకు సంబంధించిన పంట సాగులకు కూడా ఈ పథకాన్ని అందించేలా చేయబోతున్నారట. ఆర్థికంగా ఉన్నత స్థానాలలో ఉన్న వారికి మాత్రం ఈ పథకం వర్తించదట. గతంలో రాజ్యాంగబద్ధ పదవులు ఇప్పుడు నిర్వహించేవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదట. అలాగే న్యాయవాదులు, ఇంజనీరింగ్, వైద్య ,చార్టెడ్అకౌంట్, ఆర్కిటెక్లు ఇతరత్రా వృత్తి నిపుణులు కూడా అర్హులు కాదని తెలుపుతున్నారు. గత సంవత్సరంలో పన్ను చెల్లించిన వారు కూడా ఈ పథకానికి అనర్హులు అంటే తెలియజేశారు. త్వరలోనే అన్ని నిబంధనలతో పాటు అర్హతలకు సంబంధించి విషయాలను తెలియజేస్తామంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: