ఏపీ:టిడిపి పార్టీకి కౌన్ డౌన్ మొదలా..అప్పుడే వైసీపీలోకి చేరికలు..!
కానీ వారికి మాత్రం వైసిపి పార్టీలోకి రావాలి అంటే తాము గెలిచిన పార్టీకి రాజీనామా చేసి రావాలని కండిషన్ పెట్టారట. దీంతో వారు ఆగిపోయినట్టు సమాచారం. ఆ తర్వాత వంశీ, మద్దాలి గిరి, కర్ణం బలరాం, మరొక నేత కూడా వచ్చారు అలా ఇటునుంచి అటు అటు నుంచి ఇటు రావడం జరిగింది. కానీ ఈసారి మాత్రం విచిత్రం ఏమిటంటే.. మొన్న ఆ మధ్యన ఒకాయన నియోజవర్గానికి సంబంధించి కీలకమైన నేత తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక నియోజకవర్గ ఇన్చార్జి వైసీపీ పార్టీలోకి చేరడం అన్నది కీలకమైన అంశము.
సుగవాసి బాలసుబ్రమణ్యం.. రాజంపేట టిడిపి ఇన్చార్జిలో ఉన్నారు. ఇప్పుడు వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు. వాస్తవంగా 7000 ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష హోదా లేని పార్టీలోకి రావడం ఒక విశేషమైతే.. ఈయన తండ్రి దివంగత పాలకొండ రాయుడు.. ఒకసారి జనతా పార్టీ నుంచి, ఒకసారి ఇండిపెండెంట్గా రెండుసార్లు టిడిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఒకసారి ఎంపీగా కూడా పోటీ చేశారు.. రాయలసీమలో బలిజ సామాజిక వర్గానికి సంబంధించి కీలకమైన నేత.. టిడిపి నుంచి వైసీపీ పార్టీలోకి చేరడం కీలకమైన పరిణామం.. దీంతో వైసిపి నేతలు కార్యకర్తలు టిడిపి పార్టీకి ఏడాదిలోపే కౌంట్ డౌన్ మొదలయ్యింది.. అప్పుడే వైసిపి పార్టీలోకి చేరికలు మొదలయ్యాయి అంటూ కూటమి ప్రభుత్వానికి కౌంటర్ వేస్తున్నారు.