జ‌న‌సేన‌కు ఇక అక్క‌డ చిక్కులే.. ప‌వ‌న్ ఆశ‌లు వ‌దిలేసుకున్నాడా..?

RAMAKRISHNA S.S.
తెలంగాణ రాజకీయాల్లో పవన్ కల్యాణ్ ఇటీవల చేసిన “ దిష్టి ” వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీసాయి. ఆ వ్యాఖ్యలను మొదట బీఆర్ఎస్, వెంటనే కాంగ్రెస్ టార్గెట్ చేయడం యాదృచ్ఛికం కాదు. ఇది పూర్తిగా దీర్ఘకాలిక రాజకీయ వ్యూహం అని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తాయి. ముఖ్యంగా రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను ముందుగానే దృష్టిలో పెట్టుకుని ఈ రెండు పార్టీలు పవన్ వ్యాఖ్యలను సెంటిమెంట్ ఆయుధంగా మార్చుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేన పార్టీకి తెలంగాణలో పెద్ద క్యాడర్ లేదా ఓటు బ్యాంక్ ఉందా ? అనేది వేరే విషయం. కానీ కొంత ప్రభావం మాత్రం ఉంది. కొంతమంది నాయకులు పార్టీ కోసం పనిచేస్తున్నారు, కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర ఓటర్లు, కొన్ని సామాజిక వర్గాలు జనసేనకు సానుకూలంగా ఉంటాయి. అందుకే గత గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ - జనసేన కాంబినేషన్ మంచి దృష్టిని ఆకర్షించింది. జనసేన పోటీ చేయకపోయినా, బీజేపీకి ఆ పార్టీ ఓపెన్ సపోర్ట్ ఇచ్చింది.


ఈసారి కూడా గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ క్రియాశీలక పాత్ర పోషించే అవకాశం బలంగా ఉందని చాలామంది భావిస్తున్నారు. బీజేపీ - జనసేన పొత్తు మళ్లీ ఉంటే .. జ‌న‌సేన కొన్ని డివిజ‌న్ల‌లో పోటీ చేస్తే కొన్ని ప్రాంతాల్లో ఫ‌లితాల‌పై ఖ‌చ్చితంగా ప్ర‌భావం చూప‌నుంది. ప్రస్తుతం టీడీపీ తెలంగాణ రాజకీయాల్లో లేకపోవడంతో, ఆంధ్ర ఓటర్లు లేదా ఆ వర్గాలకు ప్రత్యామ్నాయ నేతగా పవన్ ఉండే అవకాశం విస్తరించింది. జనసేన నాయకులు కూడా తెలంగాణలో అవకాశాలను ఆశిస్తున్నారు. పవన్ కూడా ఆ నాయకులకు భవిష్యత్ ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ఇలాంటి కీలక సమయంలోనే పవన్ చేసిన దిష్టి వ్యాఖ్యలు బీఆర్ఎస్ - కాంగ్రెస్‌కు అనుకోని రాజకీయ అవకాశంగా మారాయి.


ఈ రెండు పార్టీలు పవన్ ప్రభావాన్ని ముందుగానే తగ్గించడంతో పాటు ఫ్యూచ‌ర్‌లోనూ జనసేన–బీజేపీ సమీకరణాన్ని బలహీనపరచడమే లక్ష్యంగా వెళ‌తారు అన‌డంలో సందేహం లేదు. ఇక‌పై  పవన్ తెలంగాణలో రాజకీయాలు చేయాలంటే ఈ వ్యాఖ్య‌ల‌ను టార్గెట్‌గా చేసుకుని ప్ర‌త్య‌ర్థులు విమ‌ర్శ‌లు చేస్తూ ఉంటారు. అందువల్ల పవన్ కల్యాణ్‌ తెలంగాణ రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. అక్క‌డ జ‌న‌సేన  బలోపేతం కావాలంటే ప్రజా సెంటిమెంట్‌ను అర్థం చేసుకోవడం.. వ్యాఖ్యల విషయంలో అప్రమత్తంగా ఉండటం..  వ్యూహాత్మక పొత్తులను సరిగ్గా నడపడం అత్యంత కీలకం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: