పూలమ్మాడు.. పాలమ్మాడు.. వేల ఎకరాలు కబ్జా చేశాడు.. కవిత సంచలన వ్యాఖ్యలు!

Reddy P Rajasekhar
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మేడ్చల్ నియోజకవర్గంలో పర్యటించి, అక్కడి స్థానిక సమస్యలపై మాజీ మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి గతంలో మేడ్చల్‌లో పూలు అమ్మి, పాలు అమ్మి, ఇప్పుడు వేల ఎకరాల భూములను కబ్జా చేశారని ఆరోపించారు. ఈయన పేదలకు ప్రత్యేకంగా చేసిందేమీ లేదని ఆమె స్పష్టం చేశారు.

మేడ్చల్‌లో చాలా అభివృద్ధి జరిగినట్టు మల్లారెడ్డి ప్రస్తావిస్తున్నా, స్థానికులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారనే విషయాన్ని తన పర్యటనలో గుర్తించినట్లు కవిత పేర్కొన్నారు. స్థానికంగా ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కాలేజ్‌లు తక్కువగా ఉండటం వల్ల యువత ఉన్నత చదువులు కొనసాగించలేక గంజాయి తదితర వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యంగా, కాంగ్రెస్ పాలనలో సమస్యలు రెట్టింపు అయ్యాయని, జీవో నంబర్ 58, 59ల కింద భూముల క్రమబద్ధీకరణకు పేదలతో డబ్బులు కట్టించుకున్నప్పటికీ నేటికీ వారికి రిజిస్ట్రేషన్లు కాలేదని కవిత నిప్పులు చెరిగారు. అయితే, మాజీ మేయర్ మరియు మల్లారెడ్డి కుటుంబ సభ్యుల భూములకు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయని ఆమె ప్రశ్నించారు. ఈ భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై సుప్రీం కోర్టు వరకు వెళ్తానని కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా తేల్చిచెప్పారు. కవిత రాబోయే రోజుల్లో రాజకీయాల్లో ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. కవిత పాలిటిక్స్ లో మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ఈ వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: