ఏపీ: వైసిపి మాజీ ఎమ్మెల్యేకు షాక్.. మరొ కేస్ ఫైల్..!

Divya
వైసిపి అధికారంలో ఉన్నప్పుడు చాలామంది కీలక నేతలు తమ హవా కొనసాగించారు. అలాంటి వారిలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఒకరు. 2024 ఎన్నికల అనంతరం కూటమి గెలవడంతో కొంతమంది సైలెంట్ కాక మరి కొంతమంది ఇతర పార్టీలలోకి చేరారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతల పైన ఇప్పటికే పలు రకాల కేసులు నమోదయ్యాయి.అలా టిడిపి కార్యకర్త కిడ్నాప్, బెదిరింపుల కేసులో వంశీ పై కేసు నమోదవ్వగా, ఈ ఏడాది ఫిబ్రవరి 16వ తేదీన అరెస్ట్ అవ్వడంతో వరుస కేసులు నమోదయ్యాయి. ఇలా ఇప్పటికే వంశీ పైన 11 కేసులు నమోదు అవ్వడంతో 140 రోజుల పాటు జైలు జీవితాన్ని కూడా గడిపారు. ఇటీవలే బెయిల్ మీద బయటకి వచ్చారు.


ఇటువంటి తరుణంలోనే వల్లభనేని వంశీకి మరో షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ లో సునీల్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వంశీతో పాటుగా ఆయన అనుచరుల పైన పోలీస్ కేసు నమోదయ్యింది. సునీల్ తెలిపిన వివరాల ప్రకారం 2024 జులై నెలలో వంశీతో పాటుగా ఆయన అనుచరులు తన మీద దాడికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించి తాజాగా పోలీసులను సైతం సునీల్ ఆశ్రయించగా కేసు నమోదు చేసినట్లుగా తెలియజేశారు.


ఈ క్రమంలోనే వల్లభనేని వంశీతో పాటుగా మరో ఎనిమిది మంది నిందితులు ఉన్నట్లుగా పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో పోలీసులు దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ పైన ఉన్న కేసులకు ఇప్పుడు తాజాగా మరొక కేసు నమోదు కావడంతో ఈ విషయం రాజకీయాలలోనే సంచలనంగా మారింది. వల్లభనేని వంశీ పైన ఇలా వరుస కేసులు నమోదు అవ్వడంతో ఆయన అనుచరులు, పలువురు నేతలు ఆందోళన చెందుతున్నారు. మరి ఈ విషయాలపైన వల్లపనేని వంశీ ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: