ఫైర్ పాలిటిక్స్‌కు ఎమోషన్ టచ్ – రేవంత్ రెడ్డి స్పీచ్ హాట్ టాపిక్..!

Amruth kumar
మనసును తాకే మాటలు చెప్పడం అందరి వల్ల కాదు. ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రాజకీయ నాయకులు భావోద్వేగాలతో మాట్లాడటం చాలా అరుదు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఆ అరుదైన కాంబినేషన్‌కు పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తున్నారు. రాజకీయంగా గట్టిగా మాట్లాడే నేతగా పేరు తెచ్చుకున్న రేవంత్… సందర్భం వచ్చినప్పుడు హృదయాలను గెలిచే మాటలతో ప్రేక్షకులను పూర్తిగా కనెక్ట్ చేయడంలో ప్రత్యేకత చూపిస్తున్నారు. కనిపించే విషయాల్ని, అందరికీ తెలిసిన అంశాల్ని, భావోద్వేగంతో మేళవించి చెప్పే టాలెంట్ రేవంత్ దగ్గర నెక్స్ట్ లెవల్‌లో ఉందని చెప్పాలి. తాను పాల్గొనే ప్రతి సభలోనూ, కార్యక్రమంలోనూ రేవంత్ మాట్లాడే తీరు ప్రత్యేకంగా ఉంటుంది. పాత విషయాన్నే కొత్త కోణంలో, ఎవరూ గమనించని అంశాన్ని అందరూ గమనించేలా చెప్పడంలో ఆయనకు ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అందుకే ఆయన మాటలు కేవలం వినిపించవు… నేరుగా హృదయానికి చేరతాయి. తాజాగా అదే తీరును మరోసారి రుజువు చేశారు రేవంత్ రెడ్డి.



ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. అయితే, ఈ ప్రసంగంలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు రాజకీయంగా, భావోద్వేగంగా పెద్ద చర్చకే దారి తీసింది. “డిసెంబరు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు… కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ప్రజలకు కూడా మిరాకిల్ మంత్” అని రేవంత్ చేసిన వ్యాఖ్య అక్కడున్న వారినే కాదు… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఇట్టే కనెక్ట్ చేసింది. ఆ మాట వెనుక అర్థాన్ని కూడా ఆయన చక్కగా వివరించారు. తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ పుట్టిన నెల డిసెంబరేనని, తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నెల కూడా ఇదేనని గుర్తు చేశారు.


ఇక్కడ మరో చారిత్రక నిజాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 2009లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా కీలక నిర్ణయం తీసుకున్నది కూడా డిసెంబరు నెలలోనే. కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం తీసుకున్న ఆ నిర్ణయం తెలంగాణ చరిత్రలో మలుపు తిప్పింది. అందుకే… తెలంగాణకు, తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి డిసెంబరు నిజంగానే మిరాకిల్ మంత్ అనే రేవంత్ మాట నూటికి నూరుపాళ్లు నిజమనే భావన కలుగుతుంది. ఇలాంటి మాటలు చెప్పడం రాజకీయ నేతలందరికీ సాధ్యం కాదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రాజకీయ వ్యూహం, భావోద్వేగం, చరిత్ర… అన్నింటినీ కలిపి చెప్పే కనెక్టింగ్ స్పీచ్‌లకు మాస్టర్‌గా మారుతున్నారని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే… ఆయన మాటలు వింటే కేవలం రాజకీయ ప్రసంగంగా కాకుండా… ఒక అనుభూతిగా మారుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: