జిల్లాల రీ–ఆర్గనైజేషన్‌కు చంద్రబాబు స్పెషల్ ప్లాన్..ఏపీ ప్రభుత్వం హై లెవల్ ఫోకస్..!

Thota Jaya Madhuri
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జరిగిన జిల్లాల విభజన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేసి, వాటికి పరిష్కారం చూపే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన కార్యాచరణను ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే జిల్లాల రీ–ఆర్గనైజేషన్ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం హై లెవల్ ఫోకస్ పెట్టింది.ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ మంత్రి satya PRASAD' target='_blank' title='అనగాని సత్యప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలో అమరావతి సచివాలయంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రుల బృందం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ – ) బుధవారం కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి మంత్రులు satya PRASAD' target='_blank' title='అనగాని సత్యప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత హాజరయ్యారు. అలాగే మంత్రులు నారాయణ, సత్య కుమార్ యాదవ్ వర్చువల్ విధానంలో ఈ సమావేశంలో పాల్గొన్నారు.


ఈ భేటీలో జిల్లాల విభజన నేపథ్యంలో ఉత్పన్నమైన పలు కీలక అంశాలపై మంత్రులు విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా గత జగన్ ప్రభుత్వ హయాంలో సరైన ప్రణాళిక లేకుండా, ప్రజా అవసరాలు, భౌగోళిక పరిస్థితులు, పరిపాలనా సౌలభ్యం వంటి అంశాలను పక్కనపెట్టి జిల్లాల విభజన జరగడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశంపై మంత్రులు లోతైన చర్చ జరిపారు.జిల్లాల విభజన కారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రజలు ఎక్కువ దూరాలు ప్రయాణించాల్సి వస్తుండటం, ఒకే నియోజకవర్గం వేర్వేరు డివిజన్లు, జిల్లాల్లో విడిపోయి పరిపాలనలో గందరగోళం నెలకొనడం, అభివృద్ధి కార్యక్రమాలు సమన్వయం లేకుండా అమలవుతున్న పరిస్థితులు ఏర్పడినట్లు మంత్రులు పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సరిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.


ఎన్నికల సందర్భంగా జిల్లాల విభజన వల్ల ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్‌ను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ అంశంపై జీవోఎం ప్రాథమికంగా రూపొందించిన నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించి, కొన్ని కీలక మార్గదర్శకాలను అందించినట్లు సమాచారం.


ముఖ్యంగా మండలాలు, పంచాయతీలను విభజించకుండా, ఒక నియోజకవర్గం పూర్తిగా ఒకే డివిజన్ పరిధిలో ఉండేలా జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరగాలనే అంశంపై జీవోఎం ఇప్పటికే స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ప్రజల సౌలభ్యమే ప్రధాన ప్రమాణంగా తీసుకుని, పరిపాలనా వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసేలా కొత్త నిర్మాణం ఉండాలనే దిశగా మంత్రులు అభిప్రాయపడ్డారు.ఇక ఈ రోజు జరిగిన సమావేశంలో మంత్రుల బృందం తుది నివేదిక రూపకల్పనపై దృష్టి సారించింది. ఈ తుది నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మంత్రివర్గ ఉప సంఘం అందజేయనుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనకు ముందే జిల్లాల పునర్వ్యవస్థీకరణపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలనే లక్ష్యంతో జీవోఎం వేగంగా పని చేస్తోంది.


జనవరి 10వ తేదీన జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశంపై కీలక చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమావేశంలో మంత్రివర్గ ఉప సంఘం చేసిన సిఫారసులకు ఆమోదం లభించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒకసారి కేబినెట్ ఆమోదం లభిస్తే, జిల్లాల రీ–ఆర్గనైజేషన్‌పై తుది నిర్ణయాలు అమలులోకి రానున్నాయి.మొత్తంగా చూస్తే, ప్రజల ఇబ్బందులను తగ్గించి, పరిపాలనా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం జిల్లాల పునర్వ్యవస్థీకరణపై దృఢమైన నిర్ణయాలతో ముందుకు సాగుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: