బండ్ల గణేష్: చంద్రబాబు కోసం సంకల్ప యాత్ర.. లేఖ వైరల్..!

Divya
టాలీవుడ్లో ప్రముఖ నిర్మాతగా పేరు సంపాదించిన బండ్ల గణేష్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అటు రాజకీయాల పరంగా కూడా తరచూ యాక్టివ్గానే కనిపిస్తారు. అయితే ఇప్పుడు తాజాగా బండ్లగణేష్ తిరుమలకు పాదయాత్ర చేపట్టేందుకు శ్రీకారం చుట్టినట్టుగా ఒక లేఖ ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వ హయాంలో సీఎం చంద్రబాబు నాయుడుని అరెస్టు చేసిన సమయంలో ఈ మొక్కు మొక్కుకున్నానని అందుకే ఇప్పుడు తీర్చుకుంటున్నానంటూ తెలియజేశారు బండ్ల గణేష్.



పూర్తి వివరాలలోకి వెళితే బండ్ల గణేష్ రాసిన లేఖలో.. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి సంకల్పయాత్ర అనే పేరుతో మొదలుపెట్ట..మన నాయకుడు దేశం గర్వించే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు మీద వేసిన అబాండాలు తొలగిపోవాలని ఆయన చెరసాల నుంచి బయటికి రావాలని , అత్యున్నత  న్యాయస్థానం సుప్రీంకోర్టు గడప మీద నిలబడి తాను ఈ మొక్కు మొక్కుకున్నానని.. నా గడప నుంచి నీ కొండ దాకా పాదయాత్ర చేసి వస్తానని.. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రతి తెలుగు వాడి ప్రార్థనలతో చంద్రబాబు మళ్ళీ అఖండ విజయంతో పూర్వ వైభవాన్ని అందుకున్నారు. తన కేసులన్నీ కూడా కొట్టేశారు. దీంతో నా మనసు కుదిటపడిందని తెలిపారు.


ఈ సమయంలోనే నా మొక్కు గుర్తుకు వచ్చిందని ఇంకా నా గడప నన్ను అడుగుతోంది.మొక్కుబడి తీర్చుకోమని.. శేషాచలం కొండ పిలుస్తోంది అందుకే మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో ఈనెల 19వ తేదీన ఉదయం 9 గంటలకు షాద్నగర్ మా ఇంటి గడప ముందు కొబ్బరికాయ కొట్టి ఈ పాదయాత్రను మొదలు పెడతానని ఆ శ్రీనివాసుని అనుగ్రహంతో కొండకు చేరి వెంకన్న స్వామి దర్శనం చేసుకోవడం సంకల్పం అంటూ తెలియజేశారు. ఇది రాజకీయ యాత్ర కాదు.. నా మనోవేదన తీర్చిన కోరిక నా మాట ఆలకించిన ఆ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామికి ఈ మొక్కు చెల్లిస్తున్నానంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: