జనసేన అసెంబ్లీలోకి అడుగు పెడుతుందా?
అయితే రాజకీయాలను సీరియస్గా తీసుకోక పోవడం పార్టీ నిర్మాణం పట్ల శ్రద్ధ పెట్టక పోవడం, బూత్ లెవల్ కమిటీలను నియమించక పోవడం వంటి సంస్దాగత లోపాల వల్ల ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది.
చివరికి ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. బరిలోకి దిగిన రెండు స్థానాల్లోనూ వెనక బడ్డారు.
గాజువాకలో 13 రౌండ్లు పూర్తయ్యేసరికి 4,500పై చిలుకు ఓట్ల వెనుకంజలో పవన్ ఉన్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముందంజలో కొనసాగుతున్నారు. ఇక భీమవరంలో 13 రౌండ్లు ముగిసేసరికి పవన్.. 2 వేలకుపైగా ఓట్ల తేడాతో వెనుకబడిపోయారు.
రాజోలులో ఆధిక్యం...
తూర్పుగోదావరి జిల్లా రాజోల్ స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కేవలం ఒకే ఒక స్థానంలో జనసేన ఆధిక్యంలో కొనసాగుతుండం ఆ పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది.