ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు

Edari Rama Krishna

ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది. కనీవినీ ఎరుగని రీతిలో, ఎగ్జిట్‌పోల్స్‌, సర్వేల అంచనాలకు సైతం అందకుండా విజయ దుంధుభీ మోగించింది.  ఇప్పటి వరకు పడ్డ  కష్టానికి ప్రతిఫలం దక్కిందని వైసీపీ శ్రేణులు సంబరాల్లో ముగినిపోతున్నారు.  కౌంటింగ్‌ సరళిని చూసుకుంటే 150కిపైగా సీట్లతో వైఎస్సార్‌సీపీ విజయదుందుభి మోగించబోతోంది.


ఇప్పటి వరకు వచ్చి ఫలితాల్లో అధికార పార్టీ టీడీపీ దారుణ ఓటమి చవిచూసింది.  ఎంతో సీనియర్లు కూడా ఈసారి దారుణంగా దెబ్బతిన్నారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీనామా చేయబోతున్నారు.


నేటి (గురువారం) సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.  రాజీనామా లేఖను ఫ్యాక్స్‌ ద్వారా చంద్రబాబు గవర్నర్‌కు పంపించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన గవర్నర్‌ నరసింహన్‌ను కలిసే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: