టీడీపి పై మండి పడ్డ విజయసాయిరెడ్డి....

Gowtham Rohith

చంద్రబాబు, లోకేష్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్ వేదిక గా తీవ్రస్థాయి లో వరుస ట్వీట్లతో మండిపడ్డారు.


మాలోకం ఆయన టీమ్ ఉన్మాదం తో రెచ్చిపోతున్నారని విమర్శించారు పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలన్న ఆశయంతో పైలెట్ ప్రాజెక్టు ను సీఎం జగన్ శ్రీకాకుళం నుంచి ప్రారంభిస్తే ఆ బస్తాల్లో నీళ్లు పోసి గడ్డగట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంట లోపలే క్షుద్ర దాడి మొదలు పెట్టారు పచ్చ దొంగలు అంటూ విజయసాయి దుమ్మెత్తిపోశారు. 

మాలోకం, ఆయన టీం ఉన్మాదంతో రెచ్చిపోతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యం ఇవ్వాలనే ఆశయంతో పైలట్ ప్రాజెక్టును శ్రీకాకుళం నుంచి ప్రారంభించారు @AndhraPradeshCM గారు.ఆ బియ్యం బస్తాల్లో నీళ్లు పోసి గడ్డకట్టిన బియ్యం ఇస్తారా అంటూ గంట లోపలే క్షుద్ర దాడి మొదలు పెట్టారు పచ్చ దొంగలు. @naralokesh

— Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2019



బాసేమో పధ్ధెనిమిది కేసుల్ లో స్టే తెచ్చుకొని తాను పత్తిగింజ అని చెప్పు కుంటారు బానిసలమా బానిసలేమో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారుంటూ విజయసాయి ధ్వజమెత్తారు



బాసేమో 18 కేసుల్లో స్టే తెచ్చుకుని తాను పత్తిగింజనని చెప్పుకుంటారు. బానిసలేమో పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్నారు. పేదలకు నాణ్యమైన బియ్యాన్నిపంపిణీ చేస్తే కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. మూడు పూటలా ఇసుక బొక్కినోళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుసు? @ncbn @JaiTDP

— Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2019


ఉద్దానం చుట్టు అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తే ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందో చూడలేక కళ్లుమూసుకున్నాడని   ఆరోపించారు పేదలకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తే కూడా జీర్ణించుకో లేక పోతున్నారని, మూడు పూటలా ఇసుక బొక్కిన నోళ్ళకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుసు అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.





ఉద్దానం చుట్టూ అద్దె విమానాల్లో ఎగిరిన వ్యక్తి ఇప్పుడు అక్కడేం జరుగుతుందో చూడలేక కళ్లు మూసుకున్నాడు. 200 పడకల కిడ్నీ రీసెర్చి సెంటర్ వస్తోంది. మెట్రోలలో తప్ప రాష్ట్రాల రాజధానుల్లో కూడా లేని సదుపాయం. ఉక్కు సంకల్పం నుంచి పుట్టుకొచ్చింది. ‘గాలి’ మాటల నుంచి కాదు. @AndhraPradeshCM

— Vijayasai Reddy V (@VSReddy_MP) September 8, 2019

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: