వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లో ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి ఈరోజు స్పందిస్తూ కోడెల మరణాన్ని కూడా రాజకీయం చేసి అతనికి ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.
ఈరోజు ట్విట్టర్ వేధికగా విజయసాయి రెడ్డి ట్విట్ చేస్తూ 'కోడెల గారి మరణాన్నీ చంద్రబాబు నాయుడు రాజకీయం చేసి ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారు. తను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను అనర్హులు చేయకుండా ఆయనను వాడుకుని వదిలేశాడు బాబు. నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు.' అంటూ విజయసాయి రెడ్డి ట్విట్ చేశాడు.
కాగా ఆంధ్ర ప్రదేశ్ మాజీ స్పీకర్, తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ ఈ నెల 16వ తేదీన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే కోడెల శివ ప్రసాద్ మృతి చెందారన్న భాదకంటే కూడా వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయాలన్న తాపత్రయమే చంద్రబాబు ముఖంలో ఎక్కువ కనిపిస్తుంది అని నెటిజన్లు కూడా కామెంట్లు పెడుతున్నారు. కాగా కోడెల మృతి చెందిన సమయం నుంచి కూడా శవరాజికీయం చేస్తున్నాడు చంద్రబాబు.
కోడెల గారి మరణాన్నీ @ncbn రాజకీయం చేసి ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారు. తను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను అనర్హులు చేయకుండా ఆయనను వాడుకుని వదిలేశాడు బాబు. నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారు. @YSRCParty @JaiTDP— Vijayasai Reddy V (@VSReddy_MP) September 18, 2019