ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్గెట్గా పావులు కదుపుతున్న పాకిస్థాన్..ఈ క్రమంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇందుకోసం రాజకీయాలు, ద్వైపాక్షిక సంబంధాలను వాడుకున్న ఆ దేశం తాజాగా భక్తిని సైతం వినియోగించుకుంటోంది. సిక్కుల ఆధ్యాత్మిక కేంద్రమైన కర్తార్పూర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్లోని కర్తార్పూర్ దర్బార్ సాహిబ్తో పంజాబ్లోని గుర్దాస్పూర్ జిల్లాలో గల డేరా బాబా నాయక్ పుణ్య క్షేత్రాన్ని అనుసంధానించేందుకు కర్తార్పూర్ కారిడార్ను నిర్మించారు. అయితే, కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి మోదీని కాకుండా మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను ఆహ్వానించాలని నిర్ణయించింది.