ఏపీలో ఒక్కో నేత విషయంలో రాజకీయం ఒక్కోలా మారుతోంది. వైసిపి ప్రభుత్వం ఏర్పడి వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నాలుగు నెలల్లోనే జంపింగ్లు మామూలుగా జరగలేదు. టిడిపి నుంచి ఏకంగా నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలోకి వెళ్లిపోయారు. ఇక టీడీపీ కీలక నేతలు సైతం ఇప్పటికే వైసిపిలోకి జంప్ చేసేశారు. మరో నాలుగైదు నెలల్లో టిడిపి నుంచి మరి కొందరు నేతలు సైతం కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపిలోకి లేదా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ లోకి వెళ్లి పోయేందుకు రెడీ అవుతున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి బిజెపిలోకి వెళ్లడం అంటే కాస్త ట్విస్టే అనుకోవాలి.
అయితే ఓ వైసిపి సీనియర్ నేత విషయంలో ఇప్పుడు ఇదే జరగనుందా ? అంటే అవుననే ఆన్సర్ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గ వైసిపిలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పోటీ చేసి ఓడిపోయిన మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు కు జగన్ ఇప్పటికే అల్టిమేటం జారీ చేసినట్టు వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో దగ్గుబాటి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.... ఆయన భార్య కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి బిజెపి నుంచి విశాఖ ఎంపీ గా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి వైసీపీని తరచుగా టార్గెట్ చేస్తూ వస్తోంది.
ఈ నేపథ్యంలోనే పురందేశ్వరి సైతం జగన్ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఇక భార్య భర్తలు చెరో పార్టీలో ఉండి డబుల్
{{RelevantDataTitle}}