రెండు రోజుల క్రితం విజయవాడ భవానీపురంలో ఇంటిముంది ఆడుకునేకి బయటకు వెళ్లి పక్కింట్లో శవం అయి తేలిన 8 ఏళ్ళ చిన్నారి ద్వారక కేసులో కీలక మలుపు తిరిగింది. ఆ చిన్నారి హత్య వెనుక తల్లి ఉందని పోలీసులు తెలుసుకున్నారు. ఆమె ఆ చిన్నారి చంపడానికి ప్రియుడికి సహకరించింది అని పోలీసుల విచారణలో తేలింది.
ఇంకా విషయానికి వస్తే.. మొన్న పాప కనిపించలేదు అని విజయవాడ భవానీపురంలో సమీప పోలీస్ స్టేషన్ లో కోపీన్ట్ ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసు బస్సు స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ వరుకు అన్ని చోట్ల పరిశీలించగా పాప ఎక్కడ ఉందనేది కనిపించలేదు. అయితే పోలీసులకు అనుమానం వచ్చి వారి పక్కింట్లో వెతికితే పాపా మృతు దేహం ఓ సంచిలో కట్టిలో కట్టేసి బీరువాలో ఉంచారు.
అది చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. పక్కింటి వ్యక్తి చంపాడని తెలియడంతో అతనికి.. తల్లిదండ్రులకు విబేధాలు ఉన్నాయని తెలియడంతో పోలీసులు తల్లిదండ్రులను, నిందితుడిని విచారించారు. అయితే పాప ద్వారక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు ప్రకాశ్తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
అయితే వారిద్దరి మధ్య ఫోన్లో సాగిన సంభాషనే విచారణలో కీలకం అయ్యింది. బాలిక తల్లికి ప్రకాశ్కు గతకొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని, అదే ద్వారక హత్యకు దారితీసినట్లు ఈ విచారణలో తెలుస్తోంది. బాలిక తల్లికి నిందితుడు ప్రకాష్ చాలా సార్లు ఫోన్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫోన్ కాల్స్పై ఆరా తీస్తున్నారు.