కేసీఆర్.. ప్రెస్ మీట్లోనూ అదరగొట్టారు..

Chakravarthi Kalyan
జీహెచ్ఎంసీ ఫలితాలు వెలువడిన తర్వాత కేసీఆర్ హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రెస్ మీట్ పెట్టారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గెలిపించినందుకు ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది పార్టీలోని అన్నివర్గాలు చేసిన కృషి ఫలితంగానే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా అందరికీ కృతజ్ఞతలు చెప్పారు.. 

ఆయన ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనూ చదవండి.. ఇది కొత్త చరిత్ర. గతంలో ఎప్పుడూ ఎన్నడూ ఏ పార్టీకీ ఇంత మెజారిటీ రాలేదు.  ఈ గెలుపుతో మనకు గర్వం వద్దు.. మనం ఇంకా అణకువతో పోవాలి. ఈ గెలుపుతో నాయకులపై మరింత భారం పెరిగింది. ఆ బాధ్యతను మనందరం గుర్తించాలి. ఈ ఓట్లు ప్రజలు ఇష్టపడి వేసినవి. 

మనం కష్టపడితే వచ్చిన ఓట్లు కావు.. ఇది ఎంత గొప్ప విజయమో.. మనం అంతే గొప్పగా ప్రజల సేవ చేసుకుందాం.. ఈ ఎన్నికల్లో మేం ఇచ్చిన మేనిఫెస్టోను తుచ తప్పకుండా అమలు చేస్తాం.. ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం.. చెప్పినవీ చెప్పనివీ చేస్తాం.. పేదల ఎజెండానే మా ఎజెండా.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: