మహిళా ఎస్ఐతో మరో మహిళ ఆ...సబంధం.. అందుకే భర్త..!

Edari Rama Krishna
ఈ మద్య సమాజంలో జరుగుతున్న వింత సంఘటనలు కొంత మంది ప్రాణాల మీదకు తెస్తుంది. తాజగా తమిళనాడులో ఓ కానిస్టేబుల్ భార్య మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుందని అడిగినందుకు చెప్పుతో కట్టిందని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..అరివఝగన్ (35) చెన్నైలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య ఎస్ఐగా పనిచేస్తోంది. కాగా ఇదే కాలేజీలో పనిచేస్తున్న మరో మహిళా ఎస్ఐతో తన భార్య సంబంధం కొనసాగిస్తోందని అరివఝగన్ చెప్పాడు.

వీరిద్దరూ ఒకే బ్యాచ్కు చెందినవారని, స్నేహితులుగా ఉంటూ కొంత కాలంగా సహజీవనం చేస్తున్నట్లు  అరివఝగన్ తెలిపాడు. అయితే వీరిద్దరి అసహజ సంబంధం గురించి తోటి పోలీసులు హేళనగా మాట్లాడుకుంటున్నారని..ఈ నేపథ్యంలో తనకు విడాకులు ఇవ్వాల్సిందిగా ఆమె తన భార్యకు చెప్పిందని తెలిపాడు.  

ఈ విషయం గురించి ప్రశ్నించినందుకు మహిళా ఎస్ఐ తీవ్రంగా అవమానించిందని, చెప్పుతో కొట్టిందని చెప్పాడు. అందరి ముందు అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నం చేసినట్టు తెలిపాడు.  మరోవైపు అరివఝగన్ తనపై అనుమానంతో ఎప్పుడూ వేదిస్తూ ఉంటాడని తనను దూషించాడని మహిళ ఎస్ఐ ఉన్నతాధికారుల వద్ద ఆరోపించింది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: