బ్రేకింగ్: బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన హైదరాబాద్

Devi Priya
రాజధాని నగరం మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని నిత్యం రద్దీగా ఉండే దిల్‌షుక్‌నగర్ ప్రాంతం పేలుళ్లతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దిల్ షుఖ్ నగర్ వద్ద మూడు వరుస బాంబు పేలుళ్లు సంబవించాయి. ఈ పేలుళ్లలో కనీసం ఏడుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. దిలుషుఖ్ నగర్ లోని కోణార్క్ థియేటర్ వద్ద పేలుళ్లు చోటు చేసుకున్నాయి. పేలుళ్ల ప్రభావం కంటే తొక్కిసలాటలోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్ కు కూత వేటు దూరంలోనే ఈ పేలుళ్లు చోటుచేసుకోవడం గమనార్హం. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు. పేలుడుకు దట్టమైన పొగలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తొలి పేలుడు జరిగిన నిమిషం వ్యవధిలోనే మరో పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. పేలుళ్లు చోటు చేసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా జంటనగరాల్లో పలు ప్రాంతాల్లో బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు ముమ్మరం చేశాయి. పేలుళ్ల సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందోనని అంతా ఉలిక్కిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: