హైదరాబాద్ లో ప్రియాంకా గాంధీ.. ఎందుకొచ్చిందో తెలిస్తే షాక్..!

Chakravarthi Kalyan
నిజంగా ఇది షాకింగ్ వార్తే..అంతేకాదు హైదరాబాద్ ను ప్రేమించే వారంతా గర్వపడాల్సిన వార్త కూడా. దేశంలో ప్రియాంకా గాంధీ అంటే తెలియని వారు ఉండరేమో. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూతురు. అంతే కాదు.. గాంధీ కుటుంబంగా పేరున్న కుటుంబానికి వారసుడిని ఇచ్చింది కూడా ఈమే. 


ఎందుకంటే సోనియా పుత్రరత్నం రాహుల్ గాంధీ ఇంకా  పెళ్లే చేసుకోలేదు. ముందు ముందు చేసుకుంటాడన్న నమ్మకమూ లేదు. ఇప్పుడు సోనియాగాంధీకి వారసుడు ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రేయాన్ గాంధీ మాత్రమే. అలాంటి ప్రియాంకా గాంధీ హైదరాబాద్ వచ్చారు. పార్టీ కార్యక్రమమో లేదా.. గొప్పోళ్ల ఫంక్షనో ఇందుకు కారణం కాదు. 



ప్రియాంక గాంధీ వచ్చింది వ్యక్తిగత పని మీద. ఆమె కుమారుడు రేయాన్ కు కంటికి గాయం కావడంతో ఎల్.వి ప్రసాద్ కంటి ఆస్పత్రిలో చూపించడానికి భర్త వద్రాతో కలిసి ఆమె ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. జడ్ కేటగిరిలో ఆమె ఉండడంతో పోలీసులు పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ నేతలకు కూడా ఆమె రాక సమాచారం అందలేదు. 



తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి ఆలస్యంగా తెలిసింది. కానీ తర్వాత కలుద్దామని ప్రియాంక కుటుంబం చెప్పడంతో ఆయన కూడా కలుసుకోలేకపోయారట.   సాయంత్రం తిరిగి ఆస్పత్రి నుంచి విమానాశ్రయానికి వెళ్లి డిల్లీ వెళ్లిపోయారట ప్రియాంకా. వైద్యం కోసం దేశ రాజధాని నుంచి హైదరాబాద్ వచ్చారంటే మన ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి గొప్పదనం ఏంటో ఇట్టే అర్థంకావడం లేదూ.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: