పవన్ పై ప్రముఖ జర్నలిస్టు సంచలన వ్యాఖ్యలు..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్.  మెగాస్టార్ చిరంజీవి తర్వాత అంత గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన పవన్ కళ్యా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ‘జనసేన’ పార్టీ స్థాపించి ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు.  ఇప్పటికే రాజధాని భూ నిర్వాసితుల కోసం పోరాడిన పవన్ ప్రస్తుతం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారు.  అయితే ఇప్పటి వరకు ఉత్తరాధివారు దక్షిణాదివారిపై చిన్న చూపు చూస్తున్నారని  తన ప్రసంగాల్లో ఎన్నో సార్లు ప్రసంగించారు.  

ఇక తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.  దీనిపై చాలా మంది రాజకీయ నాయకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న పవన్ పై తాజాగా ప్రముఖ జర్నలిస్టు అర్ణబ్ గోస్వామి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ పై ఘాటు విమర్శలు చేశారు. పవన్ కల్యాణ్ ఒక నటుడు మాత్రమేనని, మంచి పౌరుడు కాదని అన్నారు. పవన్ కల్యాణ్ స్వప్రయోజనాల నిమిత్తం దేశ ప్రజలను రెండుగా చీల్చుతున్నారని, పవన్ చర్యకు సిగ్గుపడాలని విమర్శలు చేశారు.  

భగవంతుడు అందరికీ సమానమే అని ఇందులు భాష, ప్రాంతీయ భేదం ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు.  పవన్ కల్యాణ్ స్వప్రయోజనాల నిమిత్తం దేశ ప్రజలను  రెండు వర్గాలు గా చూడటం తగదని అన్నారు.  పవన్ వ్యాఖ్యలపై  సీనియర్ నటుడు మోహన్ బాబు  కూడా ఘటుగానే స్పందించారు.  అంతే కాదు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కు మద్దతుగా నిలిచారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: