చంద్రబాబుకు షాక్ ఇచ్చిన బెజవాడ ప్రజలు..!?

Chakravarthi Kalyan
ఏపీ సర్కారు జూన్ 2న నిర్వహించిన నవ నిర్మాణదీక్ష రాష్ట్రవ్యాప్తంగా సంగతేమో కానీ... విజయవాడలో అంత ప్రభావం చూపించలేదు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన అన్యాయాన్ని గుర్తు చేసుకుని.. ఆ కసి లో నుంచి విజయం దిశగా అడుగులు వేయాలంటూ చంద్రబాబు స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసినా ఎందుకనో జనం అంతగా ఆ కార్యక్రమానికి కనెక్ట్ కాలేదు. 



విజయవాడ బెంజ్ సర్కిల్ లో ట్రాఫిక్ నిలిపేసి నవ నిర్మాణ దీక్ష , ప్రమాణం కార్యక్రమం ఏర్పాటు చేసినా ప్రజల నుంచి అంతగా స్పందన కనిపించలేదు. కనీసం సీఎం ప్రసంగం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలు సైతం నిండలేదు. వెలవెలబోయిన పరిస్థితి కనిపించింది. చంద్రబాబు అలాంటి పరిస్థితుల్లోనే తన ప్రసంగం కొనసాగించాల్సి వచ్చింది. 



ఓవైపు విజయవాడలో అదరగొడుతున్న ఎండల కారణంగానే ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. పార్టీ నాయకులు కూడా జన సమీకరణపై అంతగా దృష్టి సారించినట్టు కనిపించలేదు. చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కార్యక్రమం అందులోనూ స్వయంగా సీఎం పాల్గొన్న కార్యక్రమం ఇలా జనం లేక వెలవెలబోవడంతో చంద్రబాబు నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: