అఖిల ప్రియ కు ఏమైంది..? ఎందుకలా చేసింది..?

Shyam Rao

నవనిర్మాణదీక్ష ముగియడంతో కాకినాడలో మహా సంకల్ప ప్రతిజ్ఞను సీఎం చంద్రబాబు ఈ రోజు చేశారు. దీక్షకు సంబంధించిన ప్రతిజ్ఞ కోసం ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా హాల్‌తో సహా కుర్చీలన్నీ ఖాళీగా మిగిలిపోయాయి. దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిజ్ఞ చేయడానికి ముందే మంత్రి భూమా అఖిలప్రియ వెళ్లిపోయారు. ఈ ప్రతిజ్ఞకు సంబంధించి నంద్యాలలో  ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే, ఈ ఏర్పాట్లు చేసిన హాల్ లో కుర్చీలన్నీ ఖాళీగా ఉండటంతో అఖిల ప్రియ వెళ్లిపోయినట్టు సమాచారం.



ఇదిలా ఉండగా ఏపీ అసెంబ్లీలో లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. లీకేజీపై వైఎస్‌ఆర్‌సీపీ కుట్ర చేసిందంటూ నీచంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాలను ఎత్తిచూపిన ప్రతిసారి అలానే చేస్తున్నారని, తుని ఘటన, అరటితోట దహన సమయంలోనూ అలానే మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు: ఏపీ అసెంబ్లీలో లీకేజీలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు.



రాజధానిలోని అన్ని నిర్మాణాలను సీబీఐ విచారణలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు ఛాంబర్‌ బుల్లెట్‌ ప్రూఫ్‌.. లాంచర్‌ ప్రూఫ్‌ అని చెప్పి.. ప్రతిపక్ష నేత ఛాంబర్‌ మాత్రం వాటర్‌ ప్రూఫ్‌ కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. తేలికపాటి వర్షానికే ప్రతిపక్ష నేత ఛాంబర్‌ జలమయమైందని, సచివాలయంలో కూడా అదే పరిస్థితి ఉందని విమర్శించారు. ఇప్పటి వరకు ఆఘటనలకు సంబంధించి ఏ ఒక్కరినీ అరెస్టు చేయలేదని, వైఎస్‌ జగన్‌పై నెపం నెట్టి అవినీతి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని అన్నారు. అసెంబ్లీ, సచివాలయంలో కారింది నీళ్లు కాదని, టీడీపీ అవినీతి అని దుయ్యబట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: