" చంద్రబాబు తిండి మీద కూడా ఏడుస్తున్న జగన్ మోహన్ రెడ్డి " .

KSK

నంద్యాల ఉప ఎన్నిక లో జగన్ మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది అంటున్నారు టీడీపీ ఎంపీ కేసినేని నాని. నంద్యాల ఉప ఎన్నిక కోసం ఎన్నో కుయుక్తులు, కుట్రలు చేసిన ఆయనకి ఏదీ వర్క్ అవ్వకపోవడం తో చిరాకు వచ్చేస్తోంది అన్నారు.


జగన్ ఎన్ని కుట్రలు చేసినా ఈ ఉప ఎన్నికలో గెలిచేది తామే అన్నారు నాని. " ముఖ్యమంత్రి చంద్రబాబు కోసం ఆహారం తయారు చేసే పాంట్రీ వ్యాన్ మీద కూడా వైకాపా ఏడుస్తోంది.


ఇది శోచనీయం. పాంట్రీకారును తనిఖీ చేయించి, చివరకు అభాసుపాలయ్యారు వాళ్ళు. నోటికి ఏది వస్తే అది రాసేయడం , ఏది పడితే అది తమ ఛానల్ లో చూపించుకోవడం కోసం జగన్ ప్రూఫ్ కూడా లేకుండా మాట్లాడుతున్నారు అని ఆయన సీరియస్ అయ్యారు.


హత్యా రాజకీయాల చరిత్ర ఉన్న జగన్ పై 16 కేసులు ఉన్నాయని... అతను మళ్లీ జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: