రోజాతో నాకు పోటీయా..? అంత సీన్ లేదన్న వాణీ విశ్వనాథ్

Vasishta

వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆ పార్టీకి తురుపుముక్కలా మారారు. జగన్ తర్వాత నెంబర్ టూ ఆమేననేది స్వయంగా ఆ పార్టీ నేతలు చెబుతున్న మాట. రోజా నోరు తెరిస్తే చాలు.. ప్రత్యర్థి హడలైపోవాల్సిందే. రోజా నోటికి ఎలాగైనా తాళం వేయించాలనుకుంటున్న తెలుగుదేశం ఓ స్టార్ కోసం వెతుకుతోంది.


        టీడీపీ అన్వేషిస్తున్న సమయంలోనే తెరపైకి వచ్చారు మాజీ హీరోయిన్ వాణీ విశ్వనాధ్. సినిమాల్లో ఓ వెలుగు వెలిగిన ఆమె.. ఆ తర్వాత సినిమాలు వదిలేసి వెళ్లిపోయారు. తాజాగా జయజానకి నాయకతో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. బేసిగ్గా మళయాళీ అయిన వాణీ విశ్వనాధ్ ను ఆదరించింది మాత్రం తెలుగువాళ్లే. అందుకే ఇక్కడికి రావాలనుకుంటోంది వాణీవిశ్వనాధ్.


        దేశంలో తనకు నచ్చే ఏకైక నాయకుడు చంద్రబాబు అని వాణీ విశ్వనాధ్ కుండబద్దలు కొట్టారు. ఆయన అవకాశం ఇస్తే రాజకీయాల్లోకి వస్తానని, టీడీపీలో తప్ప మరే పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. బాబుగారు అవకాశం ఇస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా సిద్ధమేనన్న ఆమె .. త్వరలోనే చంద్రబాబును కలుస్తానన్నారు.


        రోజాను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వస్తున్నారా అనే ప్రశ్నకు వాణీ విశ్వనాధ్ తెలివైన సమాధానమిచ్చారు. అసలు రోజాతో తనకు పోటీ లేనేలేదన్నారు. పార్టీ ఒకవేళ రోజాపై పోటీ చేయమంటే పోటీ చేసేందుకు మాత్రం వెనకాడబోనని తేల్చారు. పార్టీలో చేరిన తర్వాత అధినేత ఎలా చెప్తే అలా చేస్తానని వాణీ విశ్వనాధ్ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: