షాకింగ్ : కర్నాటకలో రవితేజపై గంజాయి స్మగ్లింగ్ కేసు..?

Vasishta

మొన్నటి దాకా డ్రగ్స్.. ఇప్పుడు  గంజాయి.. టాలీవుడ్ ను మత్తు వదలడం లేదు. డ్రగ్స్ కేసులో తెలంగాణ పోలీసులు ఏర్పాటు చేసిన సిట్.. చాలామందిని విచారించిన సంగతి తెలిసిందే. హీరో రవితేజ, నవదీప్, ముమైత్ ఖాన్, నందూ, సుబ్బరాజు, ఛార్మి.. ఇలా సుమారు 12 మందిని డ్రగ్స్ కేసులో విచారించారు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ షేకైపోయింది. ఇంకెవరి పేర్లు బయటకు వస్తాయో అని వణికిపోయింది.

 

ఇప్పుడు టాలీవుడ్ ప్రముఖులను కర్ణాటక పోలీసులు కూడా విచారించబోతున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది.  ఓ కారు యాక్సిడెంట్ కేసులో ఎవరూ ఊహించని విధంగా గంజాయి దొరకడంతో టాలీవుడ్ డొంక కదిలింది. రెండ్రోజుల క్రితం టీటీడీ మాజీ ఛైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవడు.. బెంగళూరులో ఓ యాక్సిడెంట్ చేశారు. పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మారిపోయింది. కారులో భారీ ఎత్తున గంజాయి దొరకడంతో.. పోలీసులు ఆతడ్ని విచారించారు.

 

పోలీసుల విచారణలో ఆదికేశవులు నాయుడు మనవడు గీతావిష్ణు చెప్పిన విషయాలు అందరినీ కంగు తినిపించాయి. తనకు హీరో రవితేజ గంజాయి సరఫరా చేస్తాడని పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చాడు. గతంలో కూడా చాలాసార్లు తనకు అవసరమైన గంజాయిని రవితేజ సరఫరా చేసేవాడని స్టేట్ మెంట్ ఇచ్చాడు.

 

గంజాయి స్మగ్లింగ్ లో రవితేజ పేరు రావడంతో ఒక్కసారిగా టాలీవుడ్ ఉలిక్కిపడింది. గతంలో కూడా చాలాసార్లు రవితేజ సోదరుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో చాలాసార్లు వినిపించాయి. కానీ ఎక్కడా రవితేజ పేరు బయటకు రాలేదు. తెలంగాణలో డ్రగ్స్ కేసులో కూడా రవితేజను సాక్షిగానే విచారించామని సిట్ అధికారులు చెప్పారు. కానీ ఇప్పుడు రవితేజ గంజాయి సరఫరా చేశాడని కర్ణాటక పోలీసులకు ఆదికేశవులునాయుడు మనవడు గీతావిష్ణు చెప్పడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది.

 

గీతావిష్ణు ఇచ్చిన స్టేట్ మెంట్ తో కర్ణాటక పోలీసులు రవితేజను విచారించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఏ క్షణమైనా హైదరాబాద్ వచ్చి రవితేజను విచారించవచ్చని తెలుస్తోంది. లేదా ముందస్తు సమాచారం ఇచ్చి బెంగళూరులో విచారణకు హాజరుకావాలని నోటీస్ ఇచ్చే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఎలా జరిగినా.. గంజాయి కేసులో రవితేజ పోలీసుల ఎదుట హాజరుకావాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: