భర్త కళ్ల ముందే...దారుణం..!

Edari Rama Krishna
భారత దేశంలో కొంతమంది మృగాళ్లు మహిళలపై దారుణాలకు తెగబడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు.  వయసుతో నిమిత్తం లేకుండా మహిళలు కనిపిస్తే చాలు కీచకుల్లా ప్రవర్తిస్తున్నారు.  అత్యాచారం, హత్యలకు తెగబడుతూ బీభత్సం సృష్టిస్తున్నారు.  ప్రతిరోజు ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నట్లు వార్తలు చదువుతూనే ఉన్నాం.

మరోవైపు ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గులపై కఠిన శిక్షలు అమలుక పరుస్తున్నా..ఎక్కడో అక్కడ ఈ దారుణాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.  తాజాగా సభ్యసమాజం సిగ్గుతో తలవంచుకునే దారుణం ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. నలుగురు కామాంధులు ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిపారు..అదీ ఆమె భర్త చూస్తుండగానే..ఈ దారుణానికి వడిగట్టారు. 

వివరాల్లోకి వెళితే..ఉత్తరప్రదేశ్ లో ముజఫర్ నగర్ కి అనారోగ్యంతో బాధపడుతున్న తమ మూడేళ్ల బాబుని వైద్యుడికి చూపించేందుకు భార్య (30), భర్తలు ద్విచక్రవాహనంపై వెళ్లారు.  వైద్య పరీక్షలు చేయించిన తర్వాత తిరిగి వస్తున్న సమయంలో కొంత మంది దుండగులు ఆ బైక్ కు అడ్డుగా వచ్చి భర్తను కొట్టి, భార్యకు తుపాకి గురిపెట్టి ఆమెను రోడ్డుపక్కనున్న చెరకుతోటలోకి లాక్కెళ్లి అతని ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఇదంతా ఆమె భర్తముందే జరగడంతో దంపతులు నరకం అనుభవించారు. అత్యాచారం అనంతరం ఆ కామాంధులు అక్కడ నుంచి పారిపోయారు.  పొలంలో పని చేసే రైతుల సాయంతో భార్యాభర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు చేయించిన పోలీసులు, కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: