నందమూరి బాలకృష్ణ పిచ్చివాడా!

తామెంతో నీతి మంతులమని తామే గొప్పవారిమని ఎవర్నైనా తిట్టటానికి తమకే లైసన్స్ ఉందని కొందరు నాయకులు జనం పై పడిపోతూ నోరు పారేసుకోవటం బాగా అలవాటైంది. తాను ఒక మహనీయుని కుమారుడు కావటమే తనను జనం భరించ టానికి కారణమని తెలుసుకోలేకపోవటం తన ఖర్మ అని నందమూరి బాలకృష్ణనుద్దే సించి కొందరు వ్యాఖ్యానించటం ఈమధ్య పరిపాటిగా మారింది. ఒక శాసనసభ్యుడై ఉండి తరచుగా సహనం కోల్పోవటం అతనికి అలవాటవటైంది అని ప్రజలంతా అంటున్నారు.


నందమూరి నటసింహం, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై సంచలన ఆరోపణలు చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనీల్ కుమార్ యాదవ్. ఇటీవల జగన్‌పై విమర్శలకు దిగిన బాలయ్యపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇటీవల నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన  "బాలయ్యా! నువ్వు కూడా మాట్లాడుతున్నావా? నీకు పిచ్చి ఉందని సర్టిఫికేట్ తీసుకొచ్చి గతంలో ఓ కేసు నుండి బయటపడ్డావు. గతాన్ని మర్చిపోకు. కాల్పుల కేసులో బయటపడేందుకు నువ్వు ముంబై ఆసుపత్రి నుండి మానసిక స్థితి సరిగా లేదు. నేను మతిస్థిమితం కోల్పోయాను  అంటూ సర్టిఫికేట్ తెచ్చుకుని కేసు నుండి బయట పడ్డావ్.. ఇది నిజం కాదా?"  అంటూ తీవ్రస్థాయిలో విరుచు  కుపడ్డారు అనిల్ కుమార్.

అసలు నిన్ను చూస్తేనే జనం భయపడుతున్నారని, నువ్వు పబ్లిక్ మీటింగ్‌లకు పోతే ఎప్పుడు ఎవర్నీ కొడతావో? అని తెలియ డం లేదని, ఇంతకు ముందు నువ్వు పబ్లిక్‌ని కొడితే వార్త అయ్యేది, ఇప్పుడు నువ్వు ఎవర్నీ కొట్టకుండావస్తే అది వింతగా జనం చెప్పుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. నీ తండ్రిని వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన నీ బావను వెనకేసుకొచ్చిన నువ్వు  జగన్మోహనరెడ్డిగారిని విమర్శించడం సిగ్గుచేటంటూ ఫైర్ అయ్యారు.


పులి కడుపున పులి పుడుతుంది అందుకు నిదర్శనం మా నాయకుడు జగన్మోహనరెడ్డి.  ఒక మహనీయుడు కడుపున ఎలాంటి కొడుకు పుట్టకూడదని కోరుకుంటారో? దానికి నిదర్శనం నువ్వు.  అలాంటి నువ్వు కూడా మా నాయకుడ్ని విమర్శిస్తుంటే, వింత గా ఉందంటూ బాలయ్యపై తీవ్ర స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు అనిల్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: