ముందు నీ ఏడుపు సరిగ్గా ఏడు .. ప్రకాష్ రాజ్ కి మోడీ ని సపోర్ట్ చేస్తూ ట్వీట్

KSK
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గుజరాత్ ఎన్నికల విషయమై చేసిన ట్విట్ట్ ఇప్పుడు తెలుగు  ఇండస్ట్రీ లో తీవ్ర దుమారం రేపుతుంది. ఇంతకీ  ప్రకాష్ రాజ్ ప్రధాని మోడీ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ చేసారు అదేంటి అంటే 150 సీట్లు గెలుస్తాం అన్నారు కాదా మరి ఇప్పుడు ఏమయ్యింది ? ఇది గెలుపా అంటూ చేసిన షాకింగ్ ట్వీట్ చేసారు.

అయితే ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ చేసిన ట్విట్ట్ కు ప్రతిస్పందించారు తెలుగు ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖ నిర్మాత  మధుర శ్రీధర్ .. ఆయన ప్రకాష్ రాజ్ ట్వీట్ మీద మండిపడ్డారు.

తన ట్విట్టర్ ద్వారా మాట్లాడిన మధుర శ్రీధర్ ప్రకాష్ రాజ్ “ఏంటో నీ గోల” అసలు అర్థం కావడం లేదు..నీ అహంకారంతో ప్రొడ్యూసర్లను, డైరెక్టర్లను ఇబ్బంది పెడుతుంటావు కదా... నువ్వు సంతోషంగా ఉన్నావా? కేవలం హెడ్‌లైన్స్‌లో ఉండాలని ప్రయ్నత్నించకు. నీకు నిజంగా ఆసక్తిగా పోరాడాలని ఉంటే నాయకుడిగా ఎదగాలంటే ఎదుటివారిపై ఒక కామెంట్ చెయ్..అప్పుడు మేం నిన్ను సీరియస్‌గా తీసుకుంటాం అని శ్రీధర్ ట్వీట్ చేసాడు.

ఇప్పుడు  శ్రీధర్ చేసిన ట్వీట్ కు ప్రకాశ్ రాజ్ ఎలా స్పందిస్తాడో అని వేచ్చి చూడాలి. ఇంకా ప్రకాష్ రాజ్ నుంచి ఎలాంటి రిప్లయ్ రాలేదు , ప్రకాష్ రాజ్ కి చాలా మంది ఈ ట్వీట్ కింద కౌంటర్ లు వేసినా కూడా ఒక తెలుగు ప్రొడ్యూసర్ అతని ప్రొఫెషనల్ లైఫ్ మీద కామెంట్ చెయ్యడం ఆసక్తికరంగా మారింది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: