ఈ మద్య స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుంచి సెల్ఫీల పిచ్చి బాగా ఎక్కువైంది. కొన్ని సార్లు సెల్ఫీ మోజులో పడి తమ ప్రాణాలమీదకు తెచ్చుకొని చనిపోయిన సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ యువకుడు పెళ్లికూతురుతో సెల్ఫీ తీసుకొని కుటుంబ సభ్యులతో చావు దెబ్బలు తిన్నాడు. వివరాల్లోకి వెళితే..బర్రా ప్రాంతానికి చెందిన ఓ జంట స్థానికంగా ఓ ఫంక్షన్ హాల్లో వివాహం చేసుకున్నారు. అనంతరం అక్కడే రిసెప్షన్ నిర్వహించగా.. నవ వధువరులతో బంధువులంతా ఒక్కోక్కరుగా ఫోటోలు దిగుతున్నారు.
కొందరు గిఫ్ట్లు ఇస్తూ శుభాకాంక్షలు తెలిపారు.. ఇంతలో ఓ వ్యక్తి ఒక్కసారిగా స్టేజి మీదకి వచ్చి పెళ్లికూతురితో సెల్ఫీ తీసుకోబోయాడు. వచ్చిన వ్యక్తి ఎవరో తెలియక పెళ్లి కూతురు భయపడి కేకలు వేయడంతో వరుడి తరపు బంధువులు అ యువకుడిని కిందకి లాగి కొట్టారు. ఆ వ్యక్తిని దారుణంగా కొడుతుంటే..ధువు తండ్రి వారిని వారించే యత్నం చేశాడు.
అది గమనించిన పెండ్లి కొడుకు వధువు తండ్రిపై చెయ్యి చేసుకున్నాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన వధువు పెండ్లి కొడుకుపై చెయ్యి చేసుకుంది. ఆ ఘర్షణలో మరో మహిళ చెప్పు దెబ్బలతో వారిపై విరుచుకుపడింది. దీంతో పెళ్లి వాతావరణం పెద్ద రణరంగంగా మారిపోయింది. ఘటనకు సంబంధించిన ఇరు వర్గాల నుంచి ఫిర్యాదు అందినట్లు బర్రా పోలీసులు వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
#WATCH: Ruckus at a wedding in Kanpur's Barra, after the bride's family objected to a man clicking a selfie with her. Police complaint lodged. pic.twitter.com/zVTp4df8kt— ANI UP (@ANINewsUP) February 14, 2018