జగన్ ను చంపాలనుకుంటున్నారా.. వైసీపి ఆరోపణ..!

Prathap Kaluva
రాజకీయాల్లో నాయకుల ప్రాణాలకు ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అందుకే వారికి జెడ్ కేటగిరి భద్రత కల్పిస్తారు అయినప్పటికీ వారి భద్రతకు హామీ ఇవ్వలేము. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. మీరు దొంగ అంటే కాదు మీరు దొంగ అనుకోవడమూ సహజమే. కానీ తమ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ని అంతమొందించడానికి ప్లాన్ వేసారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి నేతలు అనడం హాట్ టాపిక్ గా మారింది.

కొద్దికాలం క్రితం అమరావతిలోని తాత్కాలిక అసెంబ్లీకి వర్షం నీరు వచ్చి చేరింది. ముఖ్యంగా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి చాంబర్ కు వర్షం నీరు ఎక్కువగా రావడంపై ఆ పార్టీ నేతలు పై విధంగా ఆరోపించిన విషయం విదితమే. అయితే అదంతా కావాలనే ఎవరో జగన్ కూర్చుంటున్న సీట్ కి ఆనుకొనే పెద్ద రంద్రం చేసి షార్ట్ సర్క్యూట్ వచ్చేలా ప్లాన్ చేసారని వారి ప్రధాన ఆరోపణ.

వచ్చే వర్షాకాల సమావేశాల్లో కూడా అదే ప్లాన్ ను వర్క్ అవుట్ చేయాలని ప్లాన్ చేసినట్టు వారు అంటున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎదుర్కునే దమ్ము లేనందునే ఇలాంటి పనులు చేస్తునట్టు వారు ఆరోపిస్తున్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జనం కోసం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరాడుతూనే ఉంటారని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే జగన్ మోహన్ రెడ్డిపై వచ్చిన అలాంటి వార్త అప్పట్లో రాజకీయ వర్గాల్లో పెను సంచలనమే సృష్టించింది. అయితే ఎప్పుడైతే ఆ సంఘటన జరిగిందో అప్పటి నుండి జగన్ తన భద్రతను పెంచుకున్నాడు. అయినప్పటికీ జగన్ ని ఎదుర్కోలేని కొంతమంది అతన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్లాన్ చేస్తునట్టు జోరుగా ప్రచారం సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: