షాకింగ్ - సీఎం ఇంటి సెప్టిక్ ట్యాంకులో మహిళ అస్తిపంజరం..!?

Chakravarthi Kalyan
ముఖ్యమంత్రి ఇంటి సెప్టిక్ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం.. అవును ఇది నిజం.. కాకపోతే..ఇది ఇప్పటి విషయం కాదు.. కానీ ఇప్పుడు దీనిపై కొత్త కథనాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ సీఎం ఎవరంటారా.. మొన్ననే పాతికేళ్లుగా త్రిపుర సీఎంగా ఉండి దిగిపోయిన మాణిక్ సర్కార్.. అవును.. 2004-05 సమయంలో ఆయన ఇంట్లో ఓ మహిళ అస్తిపంజరం బయపడిందట.


ఇప్పుడు అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు ఇప్పుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా బయటకు తీసుకువస్తున్నారు. అప్పటి ఆ సంఘటనపై విచారణ కోరుతున్నారు. అంతే కాదు.. సీపీఎం నేతలంతా రౌడీషీటర్లూ, హత్యారాజకీయాలు చేసేవారేనంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకే మాణిక్ సర్కారు హయాంలో పనిచేసిన మంత్రుల ఇళ్ల సెప్టిక్ ట్యాంకులన్నీ పరిశోధించాలని కొత్త డిమాండ్ వినిపిస్తున్నారు.


ఈ మేరకు త్రిపుర బీజేపీ ఇన్ ఛార్జ్ సునీల్ దేవ్ దర్ కొత్తగా బాధ్యతలు చేపట్టిన విప్లవ్ కుమార్ దేవ్ ను ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. జనవి 4, 2005 రోజు మాణిక్ సర్కార్ ఇంటి సెప్టిక్ ట్యాంకులో ఓ మహిళ అస్తిపంజరం వెలుగు చూసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సంఘటన మాత్రం వాస్తవమేనట. దీనిపై అప్పట్లో విచారణ కూడా జరిగిందట.


మరి ఆ విచారణ రిపోర్ట్ మాత్రం ఇంతవరకూ వెలుగు చూడలేదు. మరి నిజాయితీ పరుడుగా పేరున్న మాణిక్ సర్కార్ ఇంట్లో మహిళ శవం ఎందుకు లభ్యమైంది.. దానికి కారణాలేంటి.. అనే విషయాలు బీజేపీ సర్కారు పాలనలోనైనా వెలుగు చూస్తాయేమో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: