పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కు దెబ్బ పడనున్నదా ..!

Prathap Kaluva

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసినంతగా ఇంకెవరిని టార్గెట్ చేయలేదని చెప్పవచ్చు. అతన్ని పొలిటికల్ గా మరియు సినిమా ల పరంగా చాలా మంది అతన్ని టార్గెట్ చేయడం పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ కు దెబ్బ అని చెప్పవచ్చు. ఆ సంఘటనల్లో తన ప్రమేయం లేక పోయిన సరే ఎదో ఒక విధంగా తాను బలి అయిపోతున్నాడు. మొన్నటి వరకు కత్తి మహేష్ వ్యవహారం తో ఇప్పుడేమో శ్రీరెడ్డి వ్యవహారం పవన్ కు సంభందం లేని వ్యవహారం లో అతని అభిమానుల వల్లనో పొలిటికల్ గా టార్గెట్ చేయడం వలనో అతినికే దెబ్బ పడుతుంది. 


పవన్ కల్యాణ్ అభిమానులు ఇలా దుందుడుకుగా వ్యవహరించి హీరో పరువు తీయడం ఇది తొలిసారి ఎంతమాత్రమూ కాదు.. గతంలో కత్తి మహేష్.. పవన్ మీద శరపరంపరగా విమర్శలు కురిపిస్తున్న సమయంలో.. ఓ టీవీ ఛానెల్ డిస్కషన్ నుంచి తిరిగి వస్తుండగా.. వారు వెంటాడి మరీ ఆయన కారు మీద రాళ్లు రువ్వి, కోడిగుడ్లు రువ్వు నానా బీభత్సం చేశారు. అసలే కత్తి మహేష్ ప్రతిరోజూ మీడియా చుట్టూ తిరుగుతూ.. పవన్ మీద విమర్శలు రువ్వుతుండగా.. ఇలా అతని మీద దాడిచేయడం.. మరింతగా పవన్ పరువు తీసింది.


ఇప్పుడు కూడా సేమ్ టూ సేమ్ అదే రిపీట్ అయింది. శ్రీ రెడ్డి వ్యవహారం కూడా పవన్ కల్యాణ్ పుణ్యమాని మరింత హాట్ గా మారింది. దానికి ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మరింత ఆజ్యం జత చేస్తున్నారు. అది ఇంకాస్త హాటెస్ట్ గా తయారవుతున్నది. శ్రీరెడ్డి ఛానెల్ డిస్కషన్ లో ఉండగా.. అదే ఛానెల్ బయట వేచి ఉండిన పవన్ ఫ్యాన్స్ ఆమె బయటకు రాగానే.. ఆమె కారును వెంబడించి వేధించడం పవన్కు ఎలాంటి ఇమేజిని అందిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: