చంద్ర బాబు మాటలకు హద్దు అదుపు లేకుండా పోతుంది ..!

Prathap Kaluva

చంద్ర బాబు నాయుడు మాటలు వింటుంటే కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తుంది. ఇప్పుడు తాజాగా ప్రజల నుంచి నిధులు సేకరించి రాజధాని కడతానంటున్నాడు. అయితే రాజధాని కి కావాల్సిన నిధులు సేకరించే సత్తా ప్రస్తుతానికి చంద్ర బాబు దగ్గర లేదన్నది అస్సలైన వాస్తవం. అందుకే ఈ జిమ్మిక్కులు బాబు గారు మొదలెట్టారని చెప్పవచ్చు. ఇటువంటి జిమ్మిక్కులు చంద్ర బాబుకు కొత్తేమి కాదు. అరచేతిలో స్వర్గం చూపించే విధానంగా ఉంటాయి బాబు మాటలు. ప్రజలు డబ్బుతో రాజధానిని కడతా అంటే ప్రజలు నవ్వుకోరా మరి..!


ప్రజలు అప్పులు ఇస్తే.. వాటికి బాండ్లు ఇచ్చి ఆ నిధులతో రాజధాని కట్టేస్తాం అని మాత్రమే ఆయన ప్రకటించారు. ప్రజలనుంచి ఎంత మొత్తం అప్పులు తీసుకోదలచుకున్నారు.. ఎంతవరకు వారికి ఎఫ్ఆర్ బీఎం అనుమతి దొరుకుతుంది వంటి విషయాలేమీ ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అయినా ప్రజలు సిద్ధమైపోయారు అంటూ.. చంద్రబాబు అప్పుడే చెప్పేస్తున్నారు. ప్రజలు ఎగబడి నిధులిస్తున్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.


గతంలోనూ ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని, అధికారాన్ని పోటీపడి లాక్కున్నసమయంలో కూడా.. వైస్రాయి హోటల్లో ఎమ్మెల్యేలంతా ఉన్నారు.. ఉన్నారు.. అంటే మైండ్ గేమ్ ప్రారంభించి.విజయంసాధించారు చంద్రబాబు. ఇప్పుడు కూడా ప్రజలంతా నిధులు ఇచ్చేస్తున్నారు.. ఇచ్చేస్తున్నారు.. అంటూ.. మళ్లీ ప్రజలతోమైండ్ గేమ్ ఆడుతున్నారు చంద్రబాబు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: