రేడియో మిర్చి ఉద్యోగి మరణానికి బాధ్యత కేజ్రీవాల్ దా? మోడీ దా?

ప్రభుత్వం, ప్రభుత్వ అధికారుల చేతగానితనం అనండి, ఉదాసీనత అనండి, నిర్లక్ష్యం అనండి, అలక్ష్యం అనండి రోజు రహదారులపై ఎంతో మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, రహదారులపై తగిన హెచ్చరిక గుర్తులు లేకపోవడం వల్ల వాహన చోదకులు సైతం ప్రమాదాలకు గురైచనిపోతున్నారు. తాజాగా, మురుగు నీటి గుంతలో పడి రేడియే మిర్చిలో పని చేసే ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాద వివరాలను పరిశీలిస్తే:


రేడియో మిర్చి మార్కెటింగ్ టీమ్‌ లో పని చేస్తున్న తాన్యా ఖన్నా (26) మంగళవారం రాత్రి 2.30గంటల సమయంలో నోయిడా లోని సెక్టర్ 94 రోడ్డు లో కారులో వెళుతుండ గా, అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న మురుగు నీటిగుంతలో పడిపోయింది. ఆమె తన వెర్నా కారు తో సహా ఈ గుంతలో బోల్తా పడింది. ఆమె ఉద్యోగ బాధ్యతల్లో భాగంగా జరిగిన ఒక సమావేశంలో పాల్గొని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది

 
ఓ కారు వేగంగా మురికి నీటి గుంతలోకి దూసుకెళ్ళిపోవడాన్ని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేసి, సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత సహాయక సిబ్బంది అక్కడకు చేరుకుని ఆమెను రక్షించి ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆమె అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులు వెల్లడించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి, కేసు విచారణ జరుపుతున్నారు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టు వైద్యులువెల్లడించారు. అనంతరం ఆమె కుటుంబసభ్యులకు సమాచారం అందజేసి, కేసు విచారణ జరుపు తున్నారు. 

ఈ తప్పిదాలకు ఎవరు భాధ్యత వహిస్తారు డిల్లి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాలా? భారత ప్రధాని నరెంద్ర మోడీనా? 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: