దాసరి బాహుముఖ ప్రజ్ఞాశాలి : పవన్ కళ్యాన్

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణ రావు గత యేడాది అనారోగ్యంతో మరణించిన విషయం తెలిసిందే. నటుడు, దర్శకుడు, నిర్మాత, రాజకీయవేత్త ఇలా అన్ని రంగాల్లో ఆయకు ఆయనే సాటి అనేలా జీవించారని..ఆయన లేని లోటు సినీ ఇండస్ట్రీలో ఎవరూ పూడ్చలేరని కళామతల్లి గొప్ప దర్శకుడిని కోల్పోయిందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ అన్నారు.  నేడు దర్శక రత్న దాసరి పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో గడిపిన రోజులు గుర్తు చేసుకున్నారు పవన్ కళ్యాన్. 

దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతిని డైరెక్టర్స్‌ డేగా నిర్ణయించడం చాలా సంతోషకరమని సినీనటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ రోజు ప్రకటన విడుదల చేశారు. దర్శకుడి స్థాయిని సగర్వంగా పెంచిన దాసరి నారాయణ రావు జయంతిని అందరూ చిరకాలం గుర్తు పెట్టుకునేలా నిర్ణయించిన దర్శకుల సంఘానికి, ఇందుకు చొరవ చూపిన ఆ సంఘం అధ్యక్షుడు శంకర్‌కి అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.

ఆయన బహుముక ప్రజ్ఞాశాలి అని..అన్ని రంగాల్లో దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా, రచయితగా తెలుగు చిత్రసీమలో తనదైన మార్క్ చాటుకున్నారు దాసరి. సినిమా రంగం అంతా ఒక కుటుంబమని, మన ఇంటి సమస్యను మనమే చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నది ఆయన భావన అని అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: