బాబు కి బీజేపీ ఫైనల్ వార్నింగ్, జైల్లో పడేస్తాం !!!
చంద్రబాబు ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విభజనకు గురై ఎంతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రాన్ని ఆదుకుంటున్నం...కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా మలచుకొని చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం అనేక కోట్లు ఖర్చుపెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి దీక్షలు ఉపవాసాలు అంటూ కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సామాన్య ప్రజలను ఇబ్బంది పడుతున్నారని అన్నారు.
ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే వాటిని కూడా చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం తనవల్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తనకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులు తెచ్చామని ఈమధ్య తెగ ఊదర గొడుతున్నారు చంద్రబాబు...ఆయనవల్ల అక్కడ ఏ పరిశ్రమలు వచ్చాయని ఒకసారి బహిరంగంగా లెక్కలతో సహా ప్రజలకు వివరించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
ఆంధ్రరాష్ట్రంలో ఇప్పటివరకు పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి అంటే వాటన్నిటి వెనుక కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలమే అని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని అనేక జాతీయ నిఘా సంస్థల విచారణలో బయటపడింది అని అన్నారు. తన రాష్ట్రంలో సరిగ్గా ఏలుబడి చేయకుండా పక్క రాష్ట్రాల వ్యవహారాలలో తలదూరుస్తే చంద్రబాబుకు జైల్లో వెళ్లే అవకాశాలు దగ్గర ఉన్నాయని హెచ్చరించారు జీవీఎల్.